Nizamabad City | బైక్​ చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్​

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | బైక్​ చోరీలకు (bike thefts) పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) మంగళవారం వివరాలు వెల్లడించారు. నగరంలో పలు చోట్ల బైక్​ చోరీలు జరిగినట్లుగా ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. Nizamabad City | పక్కా సమాచారంతో.. ఈ మేరకు మంగళవారం పక్కా […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | బైక్​ చోరీలకు (bike thefts) పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) మంగళవారం వివరాలు వెల్లడించారు. నగరంలో పలు చోట్ల బైక్​ చోరీలు జరిగినట్లుగా ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

Nizamabad City | పక్కా సమాచారంతో..

ఈ మేరకు మంగళవారం పక్కా సమాచారంతో నగరంలో తిరుగుతున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. సీసీ కెమెరా పుటేజీలు, టెక్నికల్​ ఎవిడెన్స్​, ఇంటెలిజెన్స్​ సమాచారంతో బోధన్​ పట్టణంలోని రాకాసీపేట్​కు చెందిన అమీర్​ఖాన్​, కామారెడ్డి జిల్లా (Kamareddy district) వడ్లూర్​ గ్రామానికి చెందిన మహమ్మద్​ హనీఫ్​ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి ఐదు బైక్​లను స్వాధీనం చేసుకుని వారిరువురిని రిమాండ్​కు తరలించారు.

Nizamabad City | వాహనాలకు పటిష్టమైన లాకింగ్​ వ్యవస్థ..

ఈ సందర్భంగా ఎస్​హెచ్​వో రఘుపతి మాట్లాడుతూ.. వన్​టౌన్​ పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు 24 గంటలు పహారా, పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. వాహనాలకు పటిష్టమైన లాకింగ్​ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఎస్​హెచ్​వో సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...