Election Commission | బీహార్ ఎన్నిక‌ల షెడ్యూల్ నేడే.. సాయంత్రం విడుద‌ల చేయ‌నున్న ఈసీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ సోమ‌వారం వెలువ‌డ‌నుంది. ఈ మేర‌కు భారత ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీఐ) సాయంత్రం 4 గంట‌ల‌కు మీడియా స‌మావేశంలో షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌నుంది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల సమగ్ర సమీక్ష తర్వాత ఒక రోజు తర్వాత ఎన్నికల సంఘం (Election Commission) ఈ ప్రకటన చేసింది. 243 స్థానాలున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈసీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ సోమ‌వారం వెలువ‌డ‌నుంది. ఈ మేర‌కు భారత ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీఐ) సాయంత్రం 4 గంట‌ల‌కు మీడియా స‌మావేశంలో షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌నుంది.

రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై రెండు రోజుల సమగ్ర సమీక్ష తర్వాత ఒక రోజు తర్వాత ఎన్నికల సంఘం (Election Commission) ఈ ప్రకటన చేసింది. 243 స్థానాలున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం ఎన్నిక‌ల షెడ్యూల్‌ను వెలువ‌రించనుంది.

Election Commission | న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు..

న‌వంబ‌ర్ మొద‌టి వారంలోపు నిర్వ‌హించేందుకు ఈసీ స‌న్నాహాలు చేసింది. రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్థ‌న మేర‌కు న‌వంబ‌ర్ మొద‌టి, రెండు వారాల్లోపు పూర్తి చేసే అవ‌కాశ‌ముంది. బీహార్ నుంచి పెద్ద సంఖ్య‌లో జ‌నం వివిధ రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లారు. ఛ‌త్ పండుగ నేప‌థ్యంలో వారంతా అక్టోబ‌ర్ చివరి వారంలో తిరిగి రానున్నారు. ఈ నేప‌థ్యంలో భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించేలా ఛ‌త్ పండుగ పూర్త‌యిన వెంట‌నే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని రాజ‌కీయ పార్టీలు ఈసీని కోరాయి.

Election Commission | మూడు ద‌శ‌ల్లో..

243 మంది సభ్యులున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. ఈసారి కూడా మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశ‌ముంది. గ‌తంలో 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) మూడు దశల్లో ఓటింగ్ నిర్వహించారు. అప్ప‌ట్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఆగస్టు 2022లో నితీష్ నేతృత్వంలోని జేడీయూ.. ఎన్డీయేతో సంబంధాలను తెంచుకుంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధ‌న్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జనవరి 2024లో నితీష్ (CM Nitish Kumar) మ‌ళ్లీ ప్లేటు ఫిరాయించారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌తో తెగతెంపులు చేసుకుని, మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. త్వ‌ర‌లో జ‌రుగనున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, జేడీయూ క‌లిసి పోటీ చేయ‌నున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...