BC Reservations | బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి

అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ విద్యార్థులకు (BC students) విద్యా ఉద్యోగ రంగాలలో 42శాతం రిజర్వేషన్ కల్పిచాలని రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ జాక్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy BC Declaration) ప్రకారం 42 […]

అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, బీసీ విద్యార్థులకు (BC students) విద్యా ఉద్యోగ రంగాలలో 42శాతం రిజర్వేషన్ కల్పిచాలని రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ జాక్ ఛైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడంతో, విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ (Kamareddy BC Declaration) ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని, మరి ముఖ్యంగా బీసీ ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. నెలకు రూ.700 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నప్పటికీ అవి ఎవరికి అందుతున్నాయో అర్థం కావట్లేదని ఆయన పేర్కొన్నారు.

చివరకు రిటైర్డ్ ఉద్యోగులు బ్యాంకు రుణ కిస్తీలు (bank loan installments) కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంబడే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చెయ్యాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ జాక్ కోఆర్డినేటర్ డాక్టర్ దేశబోయిన రమ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 50శాతం ఫిట్​మెంట్​ ఇచ్చి వేతన సవరణ చేయాలని, పెండింగ్​లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు.

రిజర్వేషన్ల ఉద్యమంలో రాజీలేదని, ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు (BC employees) రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. త్వరలో లక్షలాది బీసీలతో సమావేశం నిర్వహించి, భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ రాసూరి జ్ఞానేశ్వర్, కార్యదర్శి మహేంద్ర సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారులు బుస్సా ఆంజనేయులు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కరిపే రవీందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి నారాయణ రెడ్డి, బీసీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, దయానంద్, బసవ సాయి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...