అక్షరటుడే, వెబ్డెస్క్ : IND vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డే లో భారత్ (Bharat) భారీ స్కోర్ చేసింది. రోహిత్ (Rohit)–కోహ్లీ (ohli) జంట చెలరేగడంతో నిర్ణిత 50 ఓవర్లలో 349 పరుగులు చేసింది.
రాంచిలో జరుగుతున్న తొలిమ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్శర్శ, జైశ్వాల్ (Jaiswal) దూకుడు ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే ఆదిలోనే జైశ్వాల్ 18 బర్గర్ బౌలింగ్లో డికాక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరుద్దరు కలిసి 109 బంతుల్లో 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 5 ఫోర్లు 3 సిక్స్లతో హాప్ సెంచరీ చేశాడు. 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శర్మ ఔట్ అయ్యాడు. అనంతరం కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే కెరీర్లో 52వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఫోర్లు, 7 సిక్స్లతో 120 బంతుల్లో 135 పరుగులతో రాణించాడు.
IND vs SA | రాణించిన రాహుల్
మ్యాచ్లో రుత్రాజ్ గైక్వాడ్ 8, వాషింగ్టన్ సుందర్ 13 విఫలం అయ్యారు. కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ (kl rahul ) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు కలిసి 74 బంతుల్లో 76 పరుగులు చేశారు. కోహ్లీ ఔట్ అయిన తర్వాత జడేజాతో కలిసి రాహుల్ మ్యాచ్ను ముందుకు తీసుకు వెళ్లాడు. రాహుల్ 56 బంతుల్లో 60 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా చివర్లో మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లో 32 పరుగులు చేశాడు. దీంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.
