Banswada mandal | ఉస్మానియా వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్న బాన్సువాడ వాసి

అక్షరటుడే, బాన్సువాడ: Banswada mandal | బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన మంగళి రఘు పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా (PhD doctorate degree) అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ పారిటీ పర్యవేక్షణలో ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణలో తీర్థయాత్ర పర్యాటకం – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మరియు తరువాత తులనాత్మక అధ్యయనం’ అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. దీనిని పరిశీలించిన విశ్వవిద్యాలయ అధికారులు రఘుకు […]

అక్షరటుడే, బాన్సువాడ: Banswada mandal | బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన మంగళి రఘు పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా (PhD doctorate degree) అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) చరిత్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ పారిటీ పర్యవేక్షణలో ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణలో తీర్థయాత్ర పర్యాటకం – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మరియు తరువాత తులనాత్మక అధ్యయనం’ అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. దీనిని పరిశీలించిన విశ్వవిద్యాలయ అధికారులు రఘుకు డాక్టరేట్ పట్టాను అందజేశారు.

గ్రామీణ పరిస్థితుల్లో పెరిగిన రఘు, కోనాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి పూర్తి చేసి, బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. ఓయూ పీజీ కాలేజీ నుంచి పీజీ పూర్తి చేసి, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పరిశోధనకు ప్రవేశం పొందారు. తన పరిశోధనలో భాగంగా రఘు ప్రచురించిన పలు పరిశోధనా పత్రాలు వివిధ ప్రసిద్ధ జర్నల్స్‌లో రావడం విశేషం. ప్రస్తుతం గాంధారి మండలంలోని గండివేట్ తండాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. డాక్టరేట్​ పొందిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గురువులు, గైడ్ అరుణ పారిటీ, కుటుంబ సభ్యులు, మిత్రులు, సహోద్యోగులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...