Nalla Mallareddy College | అయ్యప్ప భక్తుల ఆందోళన.. నల్ల మల్లారెడ్డి కాలేజీ దగ్గర ఉద్రిక్తత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalla Mallareddy College | మేడ్చల్ జిల్లా (Medchal District) మేడిపల్లి పీఎస్ (Medipalli PS) పరిధిలోని నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు కాలేజీ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. అయ్యప్ప మాల వేసుకున్న ఓ విద్యార్థిని కాలేజీ సిబ్బంది అవమానించారని భక్తుల ఆందోళన చేపట్టారు. మాల వేసుకుని కాలేజీకి వచ్చిన స్టూడెంట్​తో యాజమాన్యం బలవంతంగా యూనిఫామ్ వేయించింది. ఈ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalla Mallareddy College | మేడ్చల్ జిల్లా (Medchal District) మేడిపల్లి పీఎస్ (Medipalli PS) పరిధిలోని నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు కాలేజీ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.

అయ్యప్ప మాల వేసుకున్న ఓ విద్యార్థిని కాలేజీ సిబ్బంది అవమానించారని భక్తుల ఆందోళన చేపట్టారు. మాల వేసుకుని కాలేజీకి వచ్చిన స్టూడెంట్​తో యాజమాన్యం బలవంతంగా యూనిఫామ్ వేయించింది. ఈ ఘటనపై ఏబీవీపీ (ABVP), బీజేవైఎం (BJYM) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాలేజీ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Nalla Mallareddy College | అసలు ఏం జరిగిందంటే..

కాలేజీలో ఇంజినీరింగ్​ ఫస్టియర్​ చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప మాల (Ayyappa Maala) వేసుకున్నాడు. దీక్ష దుస్తులతోనే కాలేజీకి హాజరయ్యాడు. అయితే నల్ల దుస్తులు వేసుకుంటే కాలేజీలోకి అనుమతించమని యాజమాన్యం స్పష్టం చేసింది. కాలేజీ యూనిఫామ్ వేసుకోవాలని చెప్పింది. విద్యార్థితో బలవంతంగా మాల దుస్తులు తీయించి అధ్యాపకులు యూనిఫామ్ వేయించారు. ఈ మేరకు ఆ యువకుడు వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. ఇది వైరల్​ కావడంతో అయ్యప్ప స్వాములతో పాటు ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...