ACB | అవినీతికి వ్యతిరేకంగా అధికారుల అవగాహన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. ఏ శాఖలో చూసినా అవినీతి అధికారులు ఉన్నారు. ఆయా కార్యాలయాలకు పనుల కోసం వెళ్లే ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్​ 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (International Anti-Corruption Day) నిర్వహిస్తారు. దీనిని పురస్కరించుకొని ఏసీబీ అధికారులు (ACB Officers) ఈ నెల 3 నుంచి 9 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. ఏ శాఖలో చూసినా అవినీతి అధికారులు ఉన్నారు. ఆయా కార్యాలయాలకు పనుల కోసం వెళ్లే ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ప్రతి ఏటా డిసెంబర్​ 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (International Anti-Corruption Day) నిర్వహిస్తారు. దీనిని పురస్కరించుకొని ఏసీబీ అధికారులు (ACB Officers) ఈ నెల 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారంగా పాటిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అవినీతి పోవాలి.. పారదర్శకత రావాలని పోస్టర్లు విడుదల చేస్తున్నారు. లంచం ఇవ్వడం షార్ట్​కట్​ కాదని నేరమని పేర్కొంటున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు (District Collectors) అవినీతి వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి పోస్టర్లు ఆవిష్కరిస్తున్నారు.

ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్​ఫ్రీ నంబర్​ 1064కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. పోస్టర్​లో ముద్రించిన క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చని చెబుతున్నారు. నిజమైన హీరోలు లంచం ఇవ్వరని ఏసీబీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో ఏసీబీపై అవగాహన పెరిగింది. దీంతో అనేక మంది అవినీతి అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా దొరుకుతున్నారు. మరింత అవగాహన పెరిగితే లంచం తీసుకోవాలంటే అధికారులు భయపడే రోజులు వస్తాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...