Panchayat Elections | సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు దక్కించుకున్న మహిళ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా.. ప్రజలు ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మొదటి దశ నామినేషన్ల (Nominations) పర్వం పూర్తవగా.. రెండో దశ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో సర్పంచ్​ (Sarpanch) పదవి కోసం పోటాపోటీ నెలకొంది. ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గకుండా గెలుపే లక్ష్యంగా కొందరు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో సర్పంచ్​తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా.. ప్రజలు ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మొదటి దశ నామినేషన్ల (Nominations) పర్వం పూర్తవగా.. రెండో దశ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది.

చాలా గ్రామాల్లో సర్పంచ్​ (Sarpanch) పదవి కోసం పోటాపోటీ నెలకొంది. ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గకుండా గెలుపే లక్ష్యంగా కొందరు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో సర్పంచ్​తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తులు అందరు కలిసి చర్చించుకొని ఏకగ్రీవం చేస్తుండగా.. చాలా ప్రాంతాల్లో వేలంపాట, అభివృద్ధికి నిధులు అడగటం ద్వారా ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్​ను ఎన్నుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ సర్పంచ్​ పదవి కోసం రూ.73 లక్షలు పెట్టడం గమనార్హం.

Panchayat Elections | నల్గొండ జిల్లాలో..

నల్గొండ జిల్లా (Nalgonda District) చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో 11 మంది అభ్యర్థులు నామినేషన్​ వేశారు. నామినేషన్​ అనంతరం గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవంగా సర్పంచ్​ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వేలంపాట నిర్వహించారు. ఇందులో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలకు పాడి సర్పంచ్​ పదవి దక్కించుకోవడం గమనార్హం. దీంతో మిగతా అభ్యర్థులు తమ నామినేషన్లు విత్​డ్రా చేసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. నల్గొండ జిల్లా ములకలపల్లి (Mulakalapalli)లో బొడ్డుపల్లి లింగస్వామి అనే అభ్యర్ధి రూ.19 లక్షలకు వేలంలో సర్పంచ్​ పదవి దక్కించుకున్నాడు. ఈ డబ్బులతో గ్రామంలో రామాలయం నిర్మించనున్నారు.

Panchayat Elections | పట్టించుకోని అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచ్​ పదవులకు వేలంపాట నిర్వహిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వేలంలో పదవులు కొనడం గమనార్హం. అభివృద్ధి, ఆలయాల పేరిట వేలం పాట నిర్వహిస్తున్నా.. అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించడం లేదు. వేలంపాట ద్వారా ఏకగ్రీవం చేసిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...