MP Arvind | కాంగ్రెస్​ పాలనలో ఆలయాలపై దాడులు : ఎంపీ అర్వింద్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | కాంగ్రెస్​ పాలనలో హిందు ఆలయాలపై దాడులు పెరిగాయని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) ఆరోపించారు. హిందూ సమాజంపై దాడులను సహించేది లేదన్నారు. హైదరాబాద్​ నగరంలోని పలు ఆలయాలపై ఇటీవల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఎంపీ అర్వింద్​ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్​ అని సీఎం రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) చెప్పారన్నారు. దీంతోనే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | కాంగ్రెస్​ పాలనలో హిందు ఆలయాలపై దాడులు పెరిగాయని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) ఆరోపించారు. హిందూ సమాజంపై దాడులను సహించేది లేదన్నారు.

హైదరాబాద్​ నగరంలోని పలు ఆలయాలపై ఇటీవల దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఎంపీ అర్వింద్​ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ అంటే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్​ అని సీఎం రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) చెప్పారన్నారు. దీంతోనే దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఈ మాటలతో హిందూ సమాజంలో భయం పుట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​, ఎంఐఎం (Congress and MIM) కలిసి హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

MP Arvind | ఓల్డ్​ సిటీలో..

హైదరాబాద్​ నగరంలోని (Hyderabad City) పాతబస్తీలో ఆలయాలపై దాడులు పెరిగాయని ఎంపీ అర్వింద్​ అన్నారు. ఓల్డ్ ​సిటీ నుంచి హిందువులను తరిమేసే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. దాడులు జరిగినా హిందువులనే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్​రెడ్డి సీఎం అయ్యాక.. సంతోష్​ నగర్​లోని భూలక్ష్మీ మాత ఆలయం, శంషాబాద్​లోని ముత్యాలమ్మ, హనుమాన్ ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇటీవల సఫీల్​గూడ కట్టమైసమ్మ, పురాణపూల్​ మైసమ్మ గుడులపై దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ఇంకా అనేక ఘటనలు జరిగాయని ఆయన తెలిపారు. వీటికి నైతిక బాధ్యత సీఎం రేవంత్​రెడ్డిదే అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని బలిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Arvind | ఇందూరుగా మారుస్తాం..

నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుస్తామని ఎంపీ మరోసారి వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ నిర్ణయం కాదన్నారు. చారిత్రక న్యాయమని స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలం రైల్వే మ్యాప్స్‌లో కూడా ఇందూరు అనే ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్ సైతం ఇదే చెబుతుందన్నారు. ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్​లో తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొదటి తీర్మానం నగరం పేరు మార్పుపైనే ఉంటుందన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...