Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangladesh | బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సిల్హెట్‌లోని ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి దుండగులు నిప్పు అంటించారు. బంగ్లాలో కొంతకాలంగా హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హిందువులను హత్య చేశారు. మైమెన్‌ సింగ్, ఫిరోజ్‌పూర్, చిట్టగాంగ్‌లలో (Chittagong) హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులు, హత్యలు, దహనకాండలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని ఇంట్లో పెట్టి బయట లాక్ చేసి నిప్పు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bangladesh | బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సిల్హెట్‌లోని ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి దుండగులు నిప్పు అంటించారు.

బంగ్లాలో కొంతకాలంగా హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హిందువులను హత్య చేశారు. మైమెన్‌ సింగ్, ఫిరోజ్‌పూర్, చిట్టగాంగ్‌లలో (Chittagong) హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులు, హత్యలు, దహనకాండలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని ఇంట్లో పెట్టి బయట లాక్ చేసి నిప్పు అంటించారు. ఆ కుటుంబం తృటిలో ప్రాణాలతో బయటపడింది. నిత్యం దాడులు జరుగుతుండడంతో ఆ దేశంలోని హిందువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Bangladesh | చర్యలు కరువు

బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొన్ని రోజులుగా దాడులు జరుగుతున్న అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదు. డిసెంబర్ 28న పిరోజ్‌పూర్ జిల్లాలోని (Firozpur District) దుమ్రితల గ్రామంలో (Dumritala Village) ఒక ఇంటికి నిప్పంటించారు. డిసెంబర్ 18న మైమెన్‌సింగ్‌లో దైవదూషణ ఆరోపణలపై 29 ఏళ్ల కార్మికుడు దీపు చంద్ర దాస్‌ను ఒక గుంపు కొట్టి చంపి, అతని మృతదేహాన్ని తగలబెట్టింది. ఇటువంటి మతతత్వ సంఘటనలపై గట్టి చర్య తీసుకోవాలని భారత్​ బంగ్లాదేశ్‌ను కోరింది. వ్యక్తిగత శత్రుత్వాలు, రాజకీయ విభేదాలు లేదా ఇతర అదనపు కారణాలతో ఇటువంటి హింసను ఆపాదించే బంగ్లాదేశ్ ధోరణిని న్యూఢిల్లీ (New Delhi) విమర్శించింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...