ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Forest Department | అటవీశాఖ సిబ్బందిపై దాడి.. పలువురిపై కేసు నమోదు

    Forest Department | అటవీశాఖ సిబ్బందిపై దాడి.. పలువురిపై కేసు నమోదు

    Published on

    అక్షరటుడే ఇందల్వాయి: Forest Department | అటవీ భూమిని చదును చేస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకువ వెళ్లిన ఫారెస్ట్​ అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటన ఇందల్వాయి (Indalwai) మండలంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఫారెస్ట్​ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి అటవీరేంజ్ (Indalwai Forest Range)​ పరిధిలోని కొట్టాలపల్లి బీట్ కంపార్ట్​మెంట్​ 593లో అటవీ భూమిని చదును చేస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి వెళ్లారు.

    భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్​ను పట్టుకునేందుకు ప్రయత్నించగా తండావాసి భూక్యా నవీన్, మరికొందరు కలిసి అటవీ అధికారులపై కారం చల్లారు. అనంతరం సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, బీట్ అధికారులు ప్రవీణ్, రాములు, ఖదీర్, బేస్ క్యాంపు సిబ్బందిపై దాడి చేసినట్లు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ధర్పల్లి పోలీసులు (Dharpally Police station) ట్రాక్టర్​ను సీజ్​ చేసి దాడి చేసిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్​ఆర్​వో రవిమోహన్​ భట్​ పేర్కొన్నారు. అటవీ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

    పోలీసులు సీజ్​ చేసిన ట్రాక్టర్​

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...