అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. బాలురకు రక్షణగా ఉండాల్సిన ఓ వ్యక్తిపై వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నగరంలోని సైదాబాద్ బాలసదన్లో (Saidabad Balasadhan) ఆరుగురు బాలురపై స్టాఫ్గార్డు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
జువైనల్ హోమ్లో ఉండే ఓ బాలుడు దసరా పండుగకు (Dussehra festival) ఇంటికి వెళ్లాడు. అయితే పండుగ అయిపోయిన తర్వాత సదన్కు వెళ్లడానికి నిరాకరించాడు. తాను అక్కడకు వెళ్లనని ఏడ్చాడు. దీంతో తల్లిదండ్రులు వివరాలు ఆరా తీయగా.. అక్కడ జరిగిన ఘోరాలను ఆ బాలుడు వివరించాడు. జువెనైల్ హోం (juvenile home) సంరక్షుకుడు తరచూ లైంగికదాడికి పాల్పడుతున్నాడని చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad | వెలుగులోకి సంచలన విషయాలు
బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు (investigation) చేపట్టారు. మొదట ఒక బాలుడిపైనే లైంగిక దాడి జరిగిందని భావించారు. అయితే విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆరుగురు బాలురపై స్టాఫ్గార్డు లైంగికదాడికి పాల్పడినట్లు గుర్తించారు. హోమ్లో చిన్నారులను కంటికి రెప్పగా కాపాడాల్సిన స్టాఫ్గార్డు మృగంగా మారిపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హోమ్లోని బాలురకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.