Pakistan Border | పాక్ సరిహద్దుల్లో 69 యాక్టివ్ ఉగ్రస్థావరాలు.. 120 మంది ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు ప్ర‌య‌త్నం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Border | ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం అయినప్పటికీ, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఐజీ అశోక్ యాదవ్ (IG Ashok Yadav) వెల్లడించారు. ఇటీవలే భారత సైన్యం (Indian Army), వైమానిక దళం కలిసి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉన్న అనేక ఉగ్రవాద శిక్షణ శిబిరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వందలాది మంది ఉగ్రవాదులు (Terrorists) ఈ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan Border | ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం అయినప్పటికీ, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఐజీ అశోక్ యాదవ్ (IG Ashok Yadav) వెల్లడించారు.

ఇటీవలే భారత సైన్యం (Indian Army), వైమానిక దళం కలిసి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉన్న అనేక ఉగ్రవాద శిక్షణ శిబిరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వందలాది మంది ఉగ్రవాదులు (Terrorists) ఈ ఆపరేషన్‌లో హతమైనట్లు సమాచారం.అయితే ఈ దాడుల అనంతరం కూడా నియంత్రణ రేఖ ఆవల కొత్తగా సమూహీకరణ జరుగుతోందని యాదవ్ పేర్కొన్నారు.

Pakistan Border | చొరబాటు ప్రయత్నాలు విఫలం..

మొత్తం 69 ఉగ్రశిక్షణ శిబిరాలు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నాయని , వాటిలో సుమారు 100–120 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భారత్‌లోకి చొరబడేందుకు అవకాశాల కోసం ఉగ్రవాదులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన ఒక ఘటనలో, ఎనిమిది మంది ఉగ్రవాదులు నాలుగు విడతల్లో చొరబాటుకు యత్నం చేసినా , బీఎస్ఎఫ్ (BSF) దళాలు అందరి కదలికలను ముందుగానే గుర్తించి, వారిని మట్టుబెట్టినట్లు వివరించారు. సరిహద్దుల్లో ఏ ఉగ్రవాద కదలిక జరిగినా, మా దళాలు వెంటనే గుర్తించే స్థాయికి చేరుకున్నాయి. ఆధునిక పరికరాలు, నైట్ విజన్ సిస్టమ్స్, డ్రోన్ల సహాయంతో 24 గంటల పహారా కొనసాగుతోంది అని ఆయన చెప్పారు.

భారత వైమానిక దళం, సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూరు (Operation Sindoor)లో బీఎస్ఎఫ్ కూడా కీలక పాత్ర పోషించినట్లు అశోక్ యాదవ్ వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లోని పాక్ ఉగ్రవాద శిబిరాలను గుర్తించడం, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవ్వడం, గ్రౌండ్ కోఆర్డినేషన్ వంటి అంశాల్లో బీఎస్ఎఫ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...