Arya Vaishya Sangham | ఆర్యవైశ్య సంఘానికి పూర్వవైభవం రావాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangham | ఆర్యవైశ్య సంఘానికి పునర్వైభవం వచ్చేలా ప్రతిఒక్కరూ సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) అన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో కిషన్ గంజ్​లోని కార్యాలయంలో ఆత్మీయ స్నేహ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి అనుబంధ సంఘాలన్నీ సహకరించాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలన్నీ మరిచిపోయి ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో […]

అక్షరటుడే, ఇందూరు: Arya Vaishya Sangham | ఆర్యవైశ్య సంఘానికి పునర్వైభవం వచ్చేలా ప్రతిఒక్కరూ సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal) అన్నారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో కిషన్ గంజ్​లోని కార్యాలయంలో ఆత్మీయ స్నేహ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి అనుబంధ సంఘాలన్నీ సహకరించాలని సూచించారు. గతంలో జరిగిన సంఘటనలన్నీ మరిచిపోయి ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇందూరు (Induru) ఆర్యవైశ్యులకు ప్రత్యేక స్థానం ఉండేదన్నారు. మళ్లీ ఆ దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని ఆ తర్వాత అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులు అంటే దానధర్మాలకు సేవకు మారుపేరని తెలిపారు. పట్టణ సంఘంలో గెలిచిన వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా కృషి చేయాలన్నారు.

Arya Vaishya Sangham | నగరాభివృద్ధికి కృషి చేస్తున్నా..

తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే ధన్​పాల్​ పేర్కొన్నారు. ప్రధానంగా తన నియోజకవర్గానికి సీడీపీ నిధులు (CDP funds) రావడంలేదని, వాటికోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరడం లేదని వాటికోసం పోరాడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్, గాలి నాగరాజు, వీరమల్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...