అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | తెలంగాణ విశ్వ విద్యాలయంలో నిర్వహించే రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి (Graduation ceremony) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వర్సిటీ వీసీ యాదగిరి రావు (University VC Yadagiri Rao) తెలిపారు. కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో మంగళవారం వర్సిటీ ఆవరణలో పోలీసు అధికారులు తనిఖీలు చేశారు.
Telangana University | తనిఖీలను పర్యవేక్షించిన సీపీ
స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయా యూనివర్సిటీల డీన్లు వస్తుండడంతో ప్రాంగణాన్ని స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం (Sniffer Dog Squad), బాంబు డిస్పోజల్ టీం(Bomb disposal team) అధికారులు నిషితంగా పరిశీలించారు. తనిఖీలను సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) పర్యవేక్షించారు. అనంతరం ఏడో బెటాలియన్ (Seventh Battalion) గాడ్ ఆఫ్ ఆనర్ టీం, బ్యాండ్ టీం ఆర్ఎస్ఐ కొమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్స్లర్ యాదగిరిరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
Telangana University | మాక్డ్రిల్ పూర్తి..
వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్తో కలిసి మాక్ సెషన్ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ కమిటీల కన్వీనర్లు గంటా చంద్రశేఖర్, కనకయ్య, అపర్ణ, హారతి, రాంబాబు, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల నాగరాజు, పీఆర్వో పున్నయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.