HomeతెలంగాణTelangana University | తెయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

Telangana University | తెయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | తెలంగాణ విశ్వ విద్యాలయంలో నిర్వహించే రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి (Graduation ceremony) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వర్సిటీ వీసీ యాదగిరి రావు (University VC Yadagiri Rao) తెలిపారు. కార్యక్రమానికి గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో మంగళవారం వర్సిటీ ఆవరణలో పోలీసు అధికారులు తనిఖీలు చేశారు.

Telangana University | తనిఖీలను పర్యవేక్షించిన సీపీ

స్నాతకోత్సవానికి గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ, ఆయా యూనివర్సిటీల డీన్లు వస్తుండడంతో ప్రాంగణాన్ని స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం (Sniffer Dog Squad), బాంబు డిస్పోజల్ టీం(Bomb disposal team) అధికారులు నిషితంగా పరిశీలించారు. తనిఖీలను సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) పర్యవేక్షించారు. అనంతరం ఏడో బెటాలియన్​ (Seventh Battalion) గాడ్​ ఆఫ్​ ఆనర్​ టీం, బ్యాండ్​ టీం ఆర్​ఎస్​ఐ కొమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్స్​లర్​ యాదగిరిరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

Telangana University | మాక్​డ్రిల్​ పూర్తి..

వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్​తో కలిసి మాక్​ సెషన్ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ కమిటీల కన్వీనర్లు గంటా చంద్రశేఖర్, కనకయ్య, అపర్ణ, హారతి, రాంబాబు, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల నాగరాజు, పీఆర్వో పున్నయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.