అక్షరటుడే, కమ్మర్పల్లి : Kammarpally | మండలంలోని చౌటుపల్లి (Chowtupally), కమ్మర్పల్లి క్లస్టర్లలో శుక్రవారం నామినేషన్ల సమర్పణకు చివరిరోజుల కావడంతో సందడి నెలకొంది. ఈ మేరకు నామినేషన్ కేంద్రాలను ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్యాన్ మాల్వియా (Sub-Collector Abhijyan Malviya) పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట కమ్మర్పల్లి తహశీల్దార్ ప్రసాద్ (Tahsildar Prasad), ఎంపీడీవో రాజ శ్రీనివాస్ (MPDO Raja Srinivas), సిబ్బంది ఉన్నారు.
