Jinkushal Industries IPO | భారీ లాభాలు పక్కానేనా..? అందరి దృష్టి జింకుషాల్ ఐపీవోపైనే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jinkushal Industries IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market)లో ఐపీవోల వరద కొనసాగుతోంది. గురువారం నుంచి ‍ప్రారంభమయ్యే పబ్లిక్‌ ఇష్యూపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దీని జీఎంపీ(GMP) 30 శాతానికిపైగా ఉండడమే కారణం. జింకుషాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌(Jinkushal Industries Ltd)ను 2007లో స్థాపించారు. నిర్మాణ యంత్రాల సరఫరాలో ప్రత్యేకత కలిగిన ఎగుమతి వ్యాపార సంస్థ ఇది. యూఏఈ(UAE), మెక్సికో, నెదర్లాండ్స్, బెల్జియం, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, యూకే(UK)తో సహా ముప్పైకి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jinkushal Industries IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market)లో ఐపీవోల వరద కొనసాగుతోంది. గురువారం నుంచి ‍ప్రారంభమయ్యే పబ్లిక్‌ ఇష్యూపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. దీని జీఎంపీ(GMP) 30 శాతానికిపైగా ఉండడమే కారణం.

జింకుషాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌(Jinkushal Industries Ltd)ను 2007లో స్థాపించారు. నిర్మాణ యంత్రాల సరఫరాలో ప్రత్యేకత కలిగిన ఎగుమతి వ్యాపార సంస్థ ఇది. యూఏఈ(UAE), మెక్సికో, నెదర్లాండ్స్, బెల్జియం, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, యూకే(UK)తో సహా ముప్పైకి పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్త నిర్మాణ యంత్రాల వ్యాపారం, ఉపయోగించిన, పునరుద్ధరించిన యంత్రాల వ్యాపారం, దాని యాజమాన్య బ్రాండ్ HexL తయారీ మరియు ఎగుమతి, ఇందులో ప్రస్తుతం మన్నిక మరియు పనితీరు కోసం రూపొందించబడిన బ్యాక్‌హోల్డర్‌లు ఉన్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ 1,500 కంటే ఎక్కువ నిర్మాణ యంత్రాలను సరఫరా చేసింది. వాటిలో 900 కొత్తవి, 600 పునరుద్ధరించినవి. డిసెంబర్ 2024 నాటికి 228 సరఫరాదారుల సేకరణ నెట్‌వర్క్, 90 మంది శాశ్వత ఉద్యోగులు, 21 మంది ఇంటర్న్‌లతో కూడిన శ్రామిక శక్తితో, జింకుషాల్ ఇండస్ట్రీస్ తన ప్రపంచ పాదముద్రను విస్తరిస్తూనే ఉంది. కంపెనీ అంతర్జాతీయ నిర్మాణ పరికరాల మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది.

Jinkushal Industries IPO | వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం..

జింకుషాల్ ఇండస్ట్రీస్ కంపెనీ ఐపీవో(IPO) ద్వారా రూ. 116.15 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 104.54 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తోంది. మిగతా మొత్తాన్ని ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS) ద్వారా సేకరించనుంది. ఐపీవో ద్వారా సమీకరించిన మొత్తాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్(Working capital) అవసరాలకు నిధులు సమకూర్చడం కోసం, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు ప్రకటించింది.

ధరల శ్రేణి..

జింకుషాల్ ఇండస్ట్రీస్ కంపెనీ ధరల శ్రేణి(Price band)ని ఒక్కో షేరుకు రూ. 115 నుంచి రూ. 121గా నిర్ణయించింది. లాట్ సైజు 120 షేర్లు. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక అప్లికేషన్ కోసం గరిష్ట ధర వద్ద కనీసం రూ.14,520 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

కోటా, జీఎంపీ..

క్యూఐబీ(QIB)లకు 50 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం షేర్లను కేటాయించారు. కంపెనీ షేర్లకు ‍గ్రేమార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒక్కో షేరు రూ. 52 ప్రీమియంతో ట్రేడ్‌ అవుతోంది. అంటే లిస్టింగ్‌ సమయంలో 43 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆర్థిక పరిస్థితి..

2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆస్తులు(Assets) రూ. 109.44 కోట్లు ఉండగా.. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ. 179.35 కి చేరాయి. ఆదాయం రూ. 242.80 కోట్లనుంచి రూ. 385.81 కోట్లకు, ప్యాట్‌(PAT) రూ. 18.64 కోట్లనుంచి రూ. 19.14 కోట్లకు చేరింది.

ముఖ్యమైన తేదీలు..

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ (Subscription) సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు కొనసాగుతుంది. అలాట్‌మెంట్‌ స్టేటస్‌ ఈనెల 30న వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు అక్టోబర్ 3న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...