Apple smartphone | శామ్​సంగ్​ వెనక్కి.. టాప్ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్​గా మొదటి స్థానంలోకి యాపిల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple smartphone | అగ్రస్థానంలో ఉన్న శామ్​సంగ్​ స్మార్ట్​ఫోన్​ను ఆపిల్ వెనక్కి నెట్టింది. ఐఫోన్ 17 అమ్మకాలతో ఆపిల్​ అగ్రస్థానంలో నిలబడింది. గత 14 ఏళ్లలో ఫస్ట్​ టైం నంబర్ వన్​ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ స్థానం నుంచి శామ్‌సంగ్‌ Samsung వెనక్కి వెళ్లింది. ఆపిల్ మొదటి స్థానంలో నిలిచినట్లు సమాచారం. ఐఫోన్ 17 సిరీస్ పనితీరు, ఐఫోన్ 16  విజయంగా అమ్మకాలతో ఈ ఆపిల్​ ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నట్లు […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple smartphone | అగ్రస్థానంలో ఉన్న శామ్​సంగ్​ స్మార్ట్​ఫోన్​ను ఆపిల్ వెనక్కి నెట్టింది. ఐఫోన్ 17 అమ్మకాలతో ఆపిల్​ అగ్రస్థానంలో నిలబడింది. గత 14 ఏళ్లలో ఫస్ట్​ టైం నంబర్ వన్​ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ స్థానం నుంచి శామ్‌సంగ్‌ Samsung వెనక్కి వెళ్లింది. ఆపిల్ మొదటి స్థానంలో నిలిచినట్లు సమాచారం. ఐఫోన్ 17 సిరీస్ పనితీరు, ఐఫోన్ 16  విజయంగా అమ్మకాలతో ఈ ఆపిల్​ ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Apple smartphone | రెండో స్థానానికి పరిమితం..

ఐఫోన్ 17 సిరీస్‌కు అత్యధిక డిమాండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే 2025లో శామ్‌సంగ్‌ను ఆపిల్ కంపెనీ అధిగమించి వరల్డ్​లోనే  మొదటి శ్రేణి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. కొరియన్ కంపెనీ శామ్​సంగ్​ను 14 సంవత్సరాలలో మొదటిసారి అమెరికన్ ఫోన్ తయారీ కంపెనీ ఆపిల్​ ఫోన్లు ఎక్కువగా విక్రయాలు నమోదు చేసుకోవడం ఇదే ప్రథమం.

యాపిల్​ విజృంభనతో శాంసంగ్‌ రెండో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్​ను పరిశీలిస్తే.. యాపిల్ 20 శాతం, శామ్​సంగ్​ 19 శాతం, షియోమీ 13 శాతం, వివో 8 శాతం, ఒప్పో 8 శాతం, ఇతర బ్రాండ్ల కంపెనీలు 32 శాతం వాటాతో కొనసాగుతున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...