Maoists Surrender | మావోయిస్ట్​లకు మరో ఎదురుదెబ్బ.. 63 మంది సరెండర్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists Surrender | మావోయిస్ట్​లకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఏకంగా 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు (Maoists surrendered). లొంగిపోయిన మావోయిస్టుల్లో 36 మందిపై రూ.1.19 కోట్లకు పైగా రివార్డు ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘పూనా మార్గెం’ కార్యక్రమం కింద వీరు ఆయుధాలు వీడారు. లొంగిపోయిన వారిలో 18 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. సీనియర్ పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists Surrender | మావోయిస్ట్​లకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఏకంగా 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు (Maoists surrendered).

లొంగిపోయిన మావోయిస్టుల్లో 36 మందిపై రూ.1.19 కోట్లకు పైగా రివార్డు ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘పూనా మార్గెం’ కార్యక్రమం కింద వీరు ఆయుధాలు వీడారు. లొంగిపోయిన వారిలో 18 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. సీనియర్ పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) అధికారుల ముందు లొంగిపోయారని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ (Dantewada SP Gaurav Rai) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం తమను ఆకట్టుకుందని మావోయిస్టులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

Maoists Surrender | కొనసాగుతున్న లొంగు‘బాట’

ఆపరేషన్​ కగార్​ ధాటికి మావోయిస్ట్​ పార్టీ (Maoist party) దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది. కీలక నేతలు సహా వందలాది మంది మావోయిస్టులు ఎన్​కౌంటర్​లలో చనిపోయారు. దీంతో మిగతా వారు లొంగుబాట పట్టారు. తాజాగా లొంగిపోయిన వారు దక్షిణ బస్తర్ డివిజన్, పశ్చిమ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో చురుకుగా ఉన్నారని ఎస్పీ చెప్పారు.

Maoists Surrender | లొంగిపోయింది వీరే..

మావోయిస్టుల కలహండి ఏరియా కమిటీ కార్యదర్శి పక్లు అలియాస్ ప్రదీప్ ఓయం, డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ అలియాస్ ఆజాద్ కడ్తి (32), అతని భార్య సుమిత్ర అలియాస్ ద్రౌపది చపా (30), హుంగి అలియాస్ రాధిక లేకమ్ (28), సుఖ్రామ్ టాటి (20), పాండు మడ్కమ్ (19), సోమ్డు కడ్తి (21) తదితరులు జన జీవన స్రవంతిలో కలిశారు. వీరిలో ఏడుగురు క్యాడర్లపై ఒక్కొక్కరిపై రూ.5 లక్షలు, 8 మందిపై ఒక్కొక్కరిపై రూ.2 లక్షలు, 11 మందిపై ఒక్కొక్కరిపై రూ. లక్ష మరియు ముగ్గురిపై రూ.50 వేల చొప్పున రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. 63 మంది మావోయిస్టులందరికీ తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.50వేలు అందజేశారు. ప్రభుత్వ విధానం ప్రకారం వారికి తదుపరి పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...