Bangladesh | బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bangladesh | బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు (Attacks on Hindus) ఆగడం లేదు. తాజాగా మరో హిందు యువకుడిని హత్య చేశారు. హిందు యువకుడిని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (Bangladesh Nationalist Party) నేత అబుల్ హషేమ్ కారుతో ఢీకొట్టి చంపాడు. రిపోన్‌ సాహా అనే వ్యక్తి పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. అయితే కారులో పెట్రోల్‌ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లేందుకు అబుల్ యత్నించాడు. పెట్రోల్‌ డబ్బు ఇవ్వాలని రిపోన్‌ సాహా కారు వెంట […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bangladesh | బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు (Attacks on Hindus) ఆగడం లేదు. తాజాగా మరో హిందు యువకుడిని హత్య చేశారు.

హిందు యువకుడిని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (Bangladesh Nationalist Party) నేత అబుల్ హషేమ్ కారుతో ఢీకొట్టి చంపాడు. రిపోన్‌ సాహా అనే వ్యక్తి పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. అయితే కారులో పెట్రోల్‌ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లేందుకు అబుల్ యత్నించాడు. పెట్రోల్‌ డబ్బు ఇవ్వాలని రిపోన్‌ సాహా కారు వెంట పడటంతో అతడిని ఢీకొని అబుల్‌ హషేమ్ వెళ్లిపోయాడు. దీంతో సాహా అక్కడికక్కడే మృతి చెందాడు.

Bangladesh | నిందితుల అరెస్ట్​

రాజ్‌బరి జిల్లాలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సంఘటన జరిగిన సమయంలో అతను గోలందా మోర్‌లోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడని తెలిసింది. వారు ఇంధనానికి డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో ఆ కార్మికుడు కారు ముందు నిలబడ్డట్లు పోలీసులు తెలిపారు. అయితే వారు అతనిపై నుంచి కారును తీసుకు వెళ్లడంతో చనిపోయాడన్నారు. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, యజమాని అబుల్ హషీమ్ అలియాస్ సుజన్, అతని డ్రైవర్ కమల్ హుస్సేన్​ను అరెస్ట్ చేశారు. రాజ్‌బరి జిల్లా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మాజీ కోశాధికారి, జిల్లా జుబో దళ్ మాజీ అధ్యక్షుడైన హషీమ్ వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అని పోలీసులు తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...