Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోయిస్టుల మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. దంతేవాడ–బీజాపూర్​ (Dantewada and Bijapur) మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బందికి (security forces), నక్సలైట్లకు (Naxalites) మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. పశ్చిమ బస్తర్ డివిజన్‌లోని అడవిలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు కూంబింగ్​ చేపట్టాయి. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. దంతేవాడ–బీజాపూర్​ (Dantewada and Bijapur) మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బందికి (security forces), నక్సలైట్లకు (Naxalites) మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. పశ్చిమ బస్తర్ డివిజన్‌లోని అడవిలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు కూంబింగ్​ చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రాకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని భైరామ్‌గఢ్ ప్రాంతంలోని కేశ్‌కుతుల్ అడవుల్లో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది.

Chhattisgarh Encounter | కొనసాగుతున్న కూంబింగ్​

ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాల నిరంతర చర్యల కారణంగా మావోయిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరికొందరు ఇప్పటికీ ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు మావోలు చనిపోయారు. కూంబింగ్​ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

Chhattisgarh Encounter | ఆపరేషన్​ వేగవంతం

దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) ధాటికి వందలాది మంది మావోయిస్ట్​లు ఎన్​కౌంటర్లలో మృతి చెందారు. బలగాల ఒత్తిడితో చాలా మంది లొంగిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం లొంగిపోయే వారి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో మావోయిస్ట్​ పార్టీ బలహీనంగా మారింది. ఇప్పటికే పలువరు కీలక నేతలు ఎన్​కౌంటర్​లో హతం అయ్యారు. మరికొందరు లొంగిపోయారు. ఈ క్రమంలో బలగాలు ఆపరేషన్​ను వేగవంతం చేశాయి. నిరంతరం కూంబింగ్​ చేపడుతున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...