HomeజాతీయంChhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోయిస్టుల మృతి

Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. దంతేవాడ–బీజాపూర్​ మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. దంతేవాడ–బీజాపూర్​ (Dantewada and Bijapur) మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బందికి (security forces), నక్సలైట్లకు (Naxalites) మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. పశ్చిమ బస్తర్ డివిజన్‌లోని అడవిలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు కూంబింగ్​ చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రాకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని భైరామ్‌గఢ్ ప్రాంతంలోని కేశ్‌కుతుల్ అడవుల్లో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది.

Chhattisgarh Encounter | కొనసాగుతున్న కూంబింగ్​

ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాల నిరంతర చర్యల కారణంగా మావోయిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరికొందరు ఇప్పటికీ ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు మావోలు చనిపోయారు. కూంబింగ్​ ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

Chhattisgarh Encounter | ఆపరేషన్​ వేగవంతం

దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) ధాటికి వందలాది మంది మావోయిస్ట్​లు ఎన్​కౌంటర్లలో మృతి చెందారు. బలగాల ఒత్తిడితో చాలా మంది లొంగిపోతున్నారు. ప్రభుత్వాలు సైతం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నారు. ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం లొంగిపోయే వారి కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో మావోయిస్ట్​ పార్టీ బలహీనంగా మారింది. ఇప్పటికే పలువరు కీలక నేతలు ఎన్​కౌంటర్​లో హతం అయ్యారు. మరికొందరు లొంగిపోయారు. ఈ క్రమంలో బలగాలు ఆపరేషన్​ను వేగవంతం చేశాయి. నిరంతరం కూంబింగ్​ చేపడుతున్నాయి.

Must Read
Related News