అక్షరటుడే, వెబ్డెస్క్ : Chhattisgarh Encounter | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు (Maoists) మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం మరో 8 మంది చనిపోయారు.
బీజాపుర్-దంతెవాడ సరిహద్దు అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బుధవారం ఉదయం బలగాలు సెర్చ్ ఆపరేషన్ (Search operation) చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రాకు చెందిన సిబ్బంది ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో భారీగా బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు.
Chhattisgarh Encounter | కీలక నేతలు
మావోల కోసం గురువారం కూంబింగ్ (Coombing) చేపట్టగా మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్ల మోడియం ఉన్నట్లు గుర్తించారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. దక్షిణ బస్తర్ ప్రాంత పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (Deputy Inspector General) కమ్లోచన్ కశ్యప్ గురువారం మరో ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరించారు. హతమైన నక్సలైట్ల నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, AK-47, INSAS రైఫిల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నాయి.
ఈ సంవత్సరం ఛత్తీస్గఢ్లో 275 మంది నక్సలైట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిలో 246 మంది బస్తర్ ప్రాంతంలో, 27 మంది గరియాబంద్ జిల్లాలో, ఇద్దరు మొహ్లా-మన్పూర్-అంబాఘర్ చౌకి జిల్లాలో మరణించారు. మరోవైపు, ఈ సంవత్సరం రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో 23 మంది భద్రతా దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
