Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మరోసారి ఎన్​కౌంటర్​.. 20కి చేరిన మృతులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు (Maoists) మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం మరో 8 మంది చనిపోయారు. బీజాపుర్‌-దంతెవాడ సరిహద్దు అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బుధవారం ఉదయం బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ (Search operation) చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh Encounter | ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య మరోసారి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో 12 మంది మావోయిస్టులు (Maoists) మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం మరో 8 మంది చనిపోయారు.

బీజాపుర్‌-దంతెవాడ సరిహద్దు అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బుధవారం ఉదయం బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ (Search operation) చేపట్టాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రాకు చెందిన సిబ్బంది ఆపరేషన్​లో పాల్గొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు ఎన్​కౌంటర్​లో చనిపోయారు. ఎన్​కౌంటర్​ నేపథ్యంలో భారీగా బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు.

Chhattisgarh Encounter | కీలక నేతలు

మావోల కోసం గురువారం కూంబింగ్​ (Coombing) చేపట్టగా మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 20కి చేరింది. మృతుల్లో PLGA-2 కమాండర్ వెల్ల మోడియం ఉన్నట్లు గుర్తించారు. ఇంకా కూంబింగ్​ కొనసాగుతోంది. దక్షిణ బస్తర్ ప్రాంత పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (Deputy Inspector General) కమ్లోచన్ కశ్యప్ గురువారం మరో ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరించారు. హతమైన నక్సలైట్ల నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని, AK-47, INSAS రైఫిల్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాయి.

ఈ సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో 275 మంది నక్సలైట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిలో 246 మంది బస్తర్ ప్రాంతంలో, 27 మంది గరియాబంద్ జిల్లాలో, ఇద్దరు మొహ్లా-మన్‌పూర్-అంబాఘర్ చౌకి జిల్లాలో మరణించారు. మరోవైపు, ఈ సంవత్సరం రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలలో 23 మంది భద్రతా దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...