Nellore District | ఏపీలో మ‌రో బస్సు ప్ర‌మాదం.. బోల్తా ప‌డ‌డంతో ప‌లువురికి గాయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nellore District | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లకూరు మండలం (Pellakur Mandal) దొడ్లవారిమిట్ట సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus)లో ప్రమాద సమయంలో మొత్తం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nellore District | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లకూరు మండలం (Pellakur Mandal) దొడ్లవారిమిట్ట సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus)లో ప్రమాద సమయంలో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు ఒరిగి బోల్తా పడటంతో కలకలం రేగింది.

Nellore District | విజయవాడ – బెంగళూరుకు రాకపోకలో ఆగని ప్రమాదాలు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనేక మంది ప్రయాణికులు, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపించారు. ప్రమాదం వ‌ల‌న‌ జాతీయ రహదారి (National Highway)పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి గంటల తరబడి శ్రమించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం .. బస్సులో ఉన్న ఇతర ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి ప్రత్యామ్నాయ వాహనాలను ఏర్పాటు చేసింది.

గ‌త కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలల‌లో బస్సు ప్రమాదాలు భ‌య‌బ్రాంతుల‌కి గురి చేస్తున్నాయి. ఈ ప్ర‌మాదాల వ‌ల‌న చాలా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో బెంగళూరు హైవేపై జరిగిన వీ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవదహనం కావడం, తెలంగాణలో చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. పెళ్లకూరు ప్రమాదంతో మరోసారి బ‌స్సు ప్రయాణాలు సుర‌క్షిత‌మేనా అనే ప్ర‌శ్న‌లు లెవ‌నెత్తేలా చేస్తున్నాయి.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...