Amrit Bharat Express | రాష్ట్రానికి మరో అమృత్​ భారత్​ రైలు.. నేడు ప్రారంభించనున్న ప్రధాని

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amrit Bharat Express | కేంద్ర ప్రభుత్వం (Central Government) తెలంగాణకు మరో అమృత్​ భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలును కేటాయించింది. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుంచి హైదరాబాద్​ దగ్గర్లోని చర్లపల్లి టెర్మినల్ వరకు ఈ రైలు నడవనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం కేరళలో నాలుగు అమృత్​ భారత్ ఎక్స్​ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇందులో తిరువనంతపురం నుంచి చర్లపల్లి రైలు కూడా ఉంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amrit Bharat Express | కేంద్ర ప్రభుత్వం (Central Government) తెలంగాణకు మరో అమృత్​ భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలును కేటాయించింది. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుంచి హైదరాబాద్​ దగ్గర్లోని చర్లపల్లి టెర్మినల్ వరకు ఈ రైలు నడవనుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం కేరళలో నాలుగు అమృత్​ భారత్ ఎక్స్​ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇందులో తిరువనంతపురం నుంచి చర్లపల్లి రైలు కూడా ఉంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం ఒక అమృత్​ భారత్​ రైలు నడుస్తోంది. మొదటి రైలు15294/93 చర్లపల్లి నుంచి ముజఫఫ్​పూర్ మార్గంలో రాకపోకలు సాగిస్తోంది. తాజాగా మరొక అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు చర్లపల్లి నుంచి తిరువనంతపురం (Cherlapally to Thiruvananthapuram) మధ్య సేవలు అందించనుంది.

Amrit Bharat Express | వీక్లీ ఎక్స్​ప్రెస్

తిరువనంతపురం–చర్లపల్లి మధ్య అమృత్​ భారత్ రైలు వారానికి ఒకసారి నడవనుంది. రెగ్యులర్ 17041 చర్లపల్లి నుంచి వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ప్రతి బుధవారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు తిరువనంతపురం ఉత్తరం (కొచ్చువేలి) రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. 17042 రైలు తిరువనంతపురం నుంచి బుధవారం సాయంత్రం 5:30 నిమిషాలకు బయలుదేరి గురువారం రాత్రి 11:30 నిమిషాలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.

ఈ రైలు తిరువనంతపురం కొచ్చువేలి రైల్వే స్టేషన్​ (Kochuveli Railway Station)లో కేవలం 2 గంటల 45 నిమిషాలు ఖాళీగా ప్లాట్ఫారం పైన నిర్వహణ కోసం ఉంటుంది. ఈ రైలు ప్రాథమిక నిర్వహణ చర్లపల్లిలోని పిట్ లైన్​లో నిర్వహిస్తారు. మొట్ట మొదటి సారి దక్షిణ మధ్య రైల్వే జోన్ కి అమృత్ భారత్ రైలు కేటాయించారు. ముజఫర్ పూర్ నుంచి చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ఉన్నప్పటికీ ఇది తూర్పు మధ్య రైల్వే జోన్​కి చెందిన రైలు. దీనికి ప్రాథమిక నిర్వహణ ముజఫర్​పూర్ రైల్వే స్టేషన్ పిట్ లైన్​లో నిర్వహిస్తారు.

Amrit Bharat Express | ఈ స్టేషన్​లలో..

కొత్తగా ప్రారంభించే అమృత్​ భారత్​ ఎక్స్​ప్రెస్​ నల్గొండ – గుంటూరు – తెనాలి – గూడూరు – రేణిగుంట – కాట్పాడి – ఈరోడ్ – కోయంబత్తూరు – పాలక్కాడ్ – ఎర్నాకులం టౌన్ – కొట్టాయం – కాయంకులం రైల్వే స్టేషన్ ల మీదుగా వెళ్తుంది. అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్​లలో హాల్ట్ సదుపాయం కల్పించారు. ఈ రైలులో 11 జనరల్ (సాధారణ బోగీలు ), 8 స్లీపర్ బోగీలు ఉండనున్నాయి. వలస కార్మికులు, అత్యంత దూరం ప్రయాణించే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వీటిని ప్రారంభిస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...