Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల అక్రమాలను అరికట్టే ప్ర‌య‌త్నం.. అలా చేస్తే పెన్ష‌న్స్ క‌ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పింఛన్ల పంపిణీలో గత ప్రభుత్వ కాలంలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం నకిలీ పింఛన్లను గుర్తించేందుకు ప్ర‌త్యేక‌ చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా దివ్యాంగులు, హెల్త్ కేటగిరీకి (Health Category) మంజూరు చేయబడిన పింఛన్లలో జరిగిన అక్రమాలను పరిశీలించడంపై ప్రభుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఈ ప్రక్రియలో ప్రభుత్వం వైద్య బృందాలను నియమించి, దివ్యాంగుల వైకల్యం స్థాయిని పునఃపరిశీలిస్తుంది. ఇప్పటికే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో పింఛన్ల పంపిణీలో గత ప్రభుత్వ కాలంలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం నకిలీ పింఛన్లను గుర్తించేందుకు ప్ర‌త్యేక‌ చర్యలు ప్రారంభించింది.

ముఖ్యంగా దివ్యాంగులు, హెల్త్ కేటగిరీకి (Health Category) మంజూరు చేయబడిన పింఛన్లలో జరిగిన అక్రమాలను పరిశీలించడంపై ప్రభుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఈ ప్రక్రియలో ప్రభుత్వం వైద్య బృందాలను నియమించి, దివ్యాంగుల వైకల్యం స్థాయిని పునఃపరిశీలిస్తుంది. ఇప్పటికే గత ఆగస్టులో అర్హత లేని వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలు మరియు డీఆర్డీఏ సిబ్బంది ద్వారా దరఖాస్తుదారులకు సమాచారం అందించబడుతోంది.

Andhra Pradesh | ఈ రూల్ తెలుసుకోండి..

వైద్య పరీక్షల్లో 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారిని గుర్తించి, వారి పింఛన్లను రద్దు చేయనున్నారు. అయితే 60 ఏళ్లు పైబడిన అనర్హులకోసం వృద్ధాప్య పింఛన్లు (Old Age Pensions) మంజూరు చేయడం జరుగుతుంది. ఒకవేళ పరీక్షలకు హాజరు కాని వారు కూడా పింఛన్ కోల్పోతారు.రాష్ట్రంలోని పరీక్షలు బుధవారం, గురువారం, శుక్రవారంల‌లో నిర్వహించబడుతున్నాయి. ప్రతి కేంద్రంలో రోజుకు 100–130 మంది పింఛనుదారులు పరీక్షకు హాజరు కావాలి. పరీక్షలను నిర్వాహకులు ‘జంబ్లింగ్’ పద్ధతిలో వేరే ఆసుపత్రులలో నిర్వహిస్తున్నారు, దరఖాస్తుదారులకు ఏ రోజు ఏ ఆసుపత్రికి  వెళ్లాలో ముందుగా సమాచారం అందించబడుతుంది.

మొదటి విడత పరీక్షలు అక్టోబర్ 8, 9, 10 తేదీల్లో జరిగాయి. కొన్ని జిల్లాల్లో 15 నుంచి 17 వరకు వాయిదా పడిన పరీక్షలు, దీపావళి పండుగ తర్వాత 22, 23, 24, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. అధికారుల అంచనా ప్రకారం, ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి చేయడానికి సుమారు మూడు నెలలు పడుతుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి మాత్రమే పింఛన్లు అందేలా కట్టుబాటుగా చర్యలు తీసుకుంటుంది, పింఛన్ల అక్రమాలను అరికట్టడమే కూట‌మి ప్ర‌భుత్వం ముఖ్య లక్ష్యంగా చెబుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...