Land Auction | రూ.70 కోట్లు పలికిన ఎకరం భూమి.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Auction | ఎకరం భూమి ఏకంగా రూ.70 కోట్లు పలికింది. హైదరాబాద్(Hyderabad)​ నగరంలో కొంతకాలంగా రియల్​ ఎస్టేట్​ రంగం పడిపోతుందని ప్రచారం జరుగుతోంది. క్రయవిక్రయాలు లేక రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు నష్టపోతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని కేపీహెచ్​బీ(KPHB)లో ఎకరానికి ఏకంగా రూ.70 కోట్ల చొప్పున వేలం పాడి ఒక కంపెనీ దక్కించుకుకుంది. కూకట్​పల్లి(Kukatpally)లో హౌసింగ్​బోర్డుకు చెందిన 7.8 ఎకరాల భూమిని అధికారులు వేలం వేశారు. ఈ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Auction | ఎకరం భూమి ఏకంగా రూ.70 కోట్లు పలికింది. హైదరాబాద్(Hyderabad)​ నగరంలో కొంతకాలంగా రియల్​ ఎస్టేట్​ రంగం పడిపోతుందని ప్రచారం జరుగుతోంది. క్రయవిక్రయాలు లేక రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు నష్టపోతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలోని కేపీహెచ్​బీ(KPHB)లో ఎకరానికి ఏకంగా రూ.70 కోట్ల చొప్పున వేలం పాడి ఒక కంపెనీ దక్కించుకుకుంది.

కూకట్​పల్లి(Kukatpally)లో హౌసింగ్​బోర్డుకు చెందిన 7.8 ఎకరాల భూమిని అధికారులు వేలం వేశారు. ఈ భూమి వేలం కోసం గతంలోనే నోటిఫికేషన్​ జారీ చేయగా నాలుగు కంపెనీలు టెండర్ వేశాయి. ఆయా కంపెనీలు బుధవారం నిర్వహించిన వేలంలో పాల్గొన్నాయి. మొదట ఎకరాకు రూ.40 కోట్లు ప్రాథమిక ధరగా నిర్ణయించగా కంపెనీలు భూమిని దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడ్డాయి. ఈ క్రమంలో 7.8 ఎకరాల భూమిని రూ.547 కోట్లకు గోద్రెజ్ ప్రాపర్టీస్ దక్కించుకుంది. వేలంలో అరబిందో రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అశోక బిల్డర్స్‌ పాల్గొన్నాయి.

Land Auction | పేదల కోసం..

కేపీహెచ్​బీలోని భూమి దక్కించుకోవడానికి కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. బిడ్డర్లు 46 సార్లు ధరను పెంచడం గమనార్హం. చివరకు ఎల్–1లో గోద్రెజ్​ కంపెనీ ఈ భూమిని సొంతం చేసుకుంది. మూడున్నర గంటల పాటు ఈ వేలం పాట నిర్వహించారు. గోద్రేజ్ సంస్థ ఎకరానికి రూ.70 కోట్లు చెల్లించడానికి వేలం పాడినట్లు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్(Housing Board MD VP Gautam) తెలిపారు. ఈ భూముల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం కల్గించే గృహ నిర్మాణ పథకాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Land Auction | రాజీవ్​ స్వగృహ టౌన్​షిప్​లలో..

నగరంలోని పలు ప్రాంతాల్లోని రాజీవ్​స్వగృహ కార్పొరేషన్​(Rajiv Swagruha Corporation)కు చెందిన టౌన్​షిప్​లలో అసంపూర్తిగా ఉన్ టవర్లను సైతం అధికారులు బుధవారం విక్రయించారు. మొత్తం మూడు టవర్లు విక్రయించగా ప్రభుత్వానికి రూ.రూ.70.11 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ శివారులోని పోచారం టౌన్ షిప్​లో ఉన్న 112 ఫ్లాట్లను గాయత్రీ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ట్రస్టుకు రూ.30 కోట్లకు లాటరీ ద్వారా ప్రభుత్వం కేటాయించింది. ఇదే టౌన్​షిప్​లోని 72 ఫ్లాట్లతో ఉన్న ఉన్న మరో టవర్​ను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రూ.13.78 కోట్లకు కొనుగోలు చేసింది.
గాజులరామారంలో 112 ఫ్లాట్లతో టవర్​ను ఎఫ్​సీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ రూ.26.33 కోట్లకు కొనుగోలు చేసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...