Land Rates | ఎకరం భూమి రూ.137 కోట్లు.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Rates | హైదరాబాద్​ నగరంలో (Hyderabad city) భూములకు ఉన్న డిమాండ్​ తెలిసిందే. ఎకరం భూమి రూ.వంద కోట్లకు పైగా పలుకుతోంది. తాజాగా కోకాపేటలో (Kokapeta) భూమి రికార్డు ధర పలికింది. కోకాపేటలోని నియోపొలిస్‌లో ప్లాట్‌ నంబర్‌ 17, 18లోని భూములకు సోమవారం ప్రభుత్వం వేలం వేసింది. ప్లాట్‌ నం.17లోని భూమి ఎకరం ఏకంగా రూ.137.25 కోట్లు పలికింది. హెచ్​ఎండీఏ పరిధిలోని (HMDA area) ఖరీదైన భూములను ప్రభుత్వం వేలం వేస్తున్న […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Rates | హైదరాబాద్​ నగరంలో (Hyderabad city) భూములకు ఉన్న డిమాండ్​ తెలిసిందే. ఎకరం భూమి రూ.వంద కోట్లకు పైగా పలుకుతోంది. తాజాగా కోకాపేటలో (Kokapeta) భూమి రికార్డు ధర పలికింది.

కోకాపేటలోని నియోపొలిస్‌లో ప్లాట్‌ నంబర్‌ 17, 18లోని భూములకు సోమవారం ప్రభుత్వం వేలం వేసింది. ప్లాట్‌ నం.17లోని భూమి ఎకరం ఏకంగా రూ.137.25 కోట్లు పలికింది. హెచ్​ఎండీఏ పరిధిలోని (HMDA area) ఖరీదైన భూములను ప్రభుత్వం వేలం వేస్తున్న విషయం తెలిసిందే. కోకాపేట భూముల (Kokapeta lands) వేలం కోసం ఇటీవల నోటిఫికేషన్​ విడుదల చేసింది.

తాజాగా ఆన్​లైన్​లో వేలం ప్రక్రియ నిర్వహించారు. కనీస ధర రూ.99 కోట్లుగా నిర్ణయించగా.. రూ.137.25 కోట్లు పలకడం గమనార్హం. మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలోని ఆరు ప్లాట్లను హెచ్​ఎండీఏ అధికారులు వేలం వేస్తున్నారు. ప్లాట్‌ నెంబర్‌17లో 4.59 ఎకరాలు, 18లో 5.31 ఎకరాల భూమి ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు 1,355.33 కోట్లు ధర పలికింది. 2023 ఎకరాకు సగటను రూ.73 కోట్లు ఉండగా.. ఇప్పుడు 87శాతం పెరుగుదల నమోదైంది.

మిగతా భూములకు ఈ నెల 28న, డిసెంబర్​ 3న వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. గోల్డెన్‌ మైల్‌లోని సైట్‌-2లో 1.98 ఎకరాలు, మూసాపేట్‌లో 3.18, 11.48 ఎకరాల్లోని రెండు సైట్లకు అధికారులు వేలం నిర్వహించనున్నారు. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.

Land Rates | గతంలో రూ.177 కోట్లు

నగరంలోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ (Rayadurgam Knowledge City) భూములకు అక్టోబర్​ వేలం నిర్వహించారు. దీనికి రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. అత్యధికంగా ఎకరం భూమి రూ.177 కోట్లు పలికింది. అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని MSN రియాల్టీ కంపెనీ రూ.1357.59 కోట్లకు దక్కించుకుంది. వేలం ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా MSN రియాల్టీ ఏకంగా రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...