Phone Tapping | అన్ని ప్రభుత్వాలు ఫోన్​ ట్యాపింగ్​ చేస్తాయి : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping | రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ కేసు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో సిట్​ దూకుడు పెంచడంతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సిట్​ అధికారులు (SIT Officers) ఫోన్​ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్​రావును విచారించారు. తాజాగా కేటీఆర్​ను ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణపై బీఆర్​ఎస్​ నేతలు (BRS Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నాయకుడు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping | రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ కేసు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో సిట్​ దూకుడు పెంచడంతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

సిట్​ అధికారులు (SIT Officers) ఫోన్​ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేశారు. ఇటీవల మాజీ మంత్రి హరీశ్​రావును విచారించారు. తాజాగా కేటీఆర్​ను ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణపై బీఆర్​ఎస్​ నేతలు (BRS Leaders) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ నాయకుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని ప్రభుత్వాలు ట్యాపింగ్​ చేస్తాయన్నారు. ఫోన్ ట్యాప్ చేయడం నేరం కాదని.. దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చని ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పిన వీడియోని ఆయన చూపించారు.

Phone Tapping | చర్చ జరగడం లేదు

ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గతంలో చెప్పారని ప్రవీణ్​కుమార్​ అన్నారు. ఈ రోజు ఆయన ట్యాపింగ్ మీద కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తారని, అన్ని ప్రభుత్వాలు చేస్తాయి చెప్పారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా దీనిపై చర్చ జరగడం లేదన్నారు.

Phone Tapping | సజ్జనార్​కు అర్హత లేదు

నోటుకు ఓటు కేసులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయినప్పుడు SIగా సజ్జనార్ (Sajjanar) ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఉన్నారని చెప్పారు. ఆనాడు సజ్జనార్, ఇంకా కొంత మంది అధికారులు తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఏపీలో కేసులు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు అదే సజ్జానార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బృందానికి నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. రాజకీయ నాయకులను వేధించడానికి ఏర్పాటు చేసిన సిట్‌కు సజ్జనార్ చీఫ్‌గా ఉన్నారని విమర్శించారు. ఆయనకు సిట్‌ను లీడ్ చేసి, ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత లేదన్నారు. సజ్జనార్‌పై ఏడు కేసులు ఉన్నాయని, వాటిపై విచారణ జరగాలని డిమాండ్​ చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...