Homeతాజావార్తలుColdwave | ప్రజలకు అలెర్ట్​.. పెరగనున్న చలి తీవ్రత

Coldwave | ప్రజలకు అలెర్ట్​.. పెరగనున్న చలి తీవ్రత

రాష్ట్రంలో చలి తీవ్రత పెరగనుంది. రానున్న పది రోజులు శీతల గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coldwave | రాష్ట్రంలో కొద్ది రోజులుగా చలి కాస్త తగ్గింది. అయితే రానున్న పది రోజులు ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చలిగాలులు వణికిస్తాయన్నారు.

ఈ ఏడాది చలికాలం ప్రారంభం నుంచే శీతలగాలులు వీస్తున్నాయి. నవంబర్​ రెండో వారం నుంచి భారీగా చలి పెట్టింది. సాయంత్రం 6 అయిందంటే కాలు బయట్ట పెట్టలేని పరిస్థితి. ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత కొనసాగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దిత్వా తుపాన్​ కారణంగా కొన్ని రోజులు చలి తగ్గింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. దీంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. తాజాగా మరోసారి చలితీవ్రత పెరుగుతుందని అధికారులు (Meteorological Department Officers) చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Coldwave | అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో రానున్న పది రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉత్తర తెలంగాణ (Telangana)లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉంది. నేటి రాత్రి నుంచే చలి తీవ్రత పెరగనుంది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో రేపటి నుంచి చలి పెరుగుతుంది. శీతల గాలులు వీయనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాత్రి పూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలన్నారు. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు పాటించాలి.

Must Read
Related News