అక్షరటుడే, వెబ్డెస్క్ : Sabarimala | శబరిమలలో అయ్యప్ప (Ayyappa) దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో భక్తుల కోసం వివిధ ప్రాంతాల నుంచి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
మండల – మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో నవంబర్ 16న శబరిమలలో ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. నవంబర్ 17 నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. ఆన్లైన్, స్పాట్ బుకింగ్ ద్వారా అయ్యప్ప దర్శనానికి (Ayyappa Darshan) టోకెన్లు జారీ చేస్తున్నారు. అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తెలంగాణ నుంచి ఎంతో మంది స్వామి దర్శనానికి వెళ్తుంటారు. వారికోసం నాందేడ్ (Nanded) నుంచి కొల్లం (07123) రైలును ఈ నెల 24న అధికారులు నడపనున్నారు.
ఈ స్పెషల్ ట్రైన్ నాందేడ్ నుంచి బయలు దేరి కొల్లం చేరుకుంటుంది. మధ్యలో 38 స్టేషన్లలో ఆగుతుంది. తెలంగాణలోని బాసర, నిజామాబాద్ (Nizamabad), ఆర్మూర్, కోరుట్ల, లింగంపేట, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతుంది. భక్తులు ఈ రైలును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
