Akhanda 2 | అఖండ 2 సినిమా టికెట్ ధరలు పెంపు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Akhanda 2 | బోయపాటి (Boyapati) దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ–2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) అనుమతి ఇచ్చింది. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన అఖండ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అఖండ–2 తాండవంపై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్​ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Akhanda 2 | బోయపాటి (Boyapati) దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ–2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) అనుమతి ఇచ్చింది. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన అఖండ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అఖండ–2 తాండవంపై భారీ అంచనాలు ఉన్నాయి.

నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్​ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డిసెంబర్​ 4న ప్రీమియర్​ షోలు (Premiere shows) వేసుకోవడానికి సైతం ఓకే చెప్పింది. 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్​ షో వేసుకోవచ్చు. దీని టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు.

ఈ నెల 5న సినిమా రిలీజ్​ కానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.75 రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు పెంచిన రేట్లు అమలులో ఉంటాయి.

Akhanda 2 | బాలయ్య ఫ్యాన్స్​లో జోష్

బాలయ్య అఖండ తర్వాత వీర సింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదు. దాదాపు రెండేళ్లుగా ఆయన సినిమాలు రిలీజ్​ కాలేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్​ అఖండ–2 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్​, ట్రైలర్​ మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రిలీజ్​ చేయనున్నారు. కాగా సినిమా టికెట్ల ధరలకు పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపగా.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...