HomeసినిమాAkhanda 2 | అఖండ 2 సినిమా టికెట్ ధరలు పెంపు

Akhanda 2 | అఖండ 2 సినిమా టికెట్ ధరలు పెంపు

అఖండ–2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.75 రేటు పెంచుకోవడానికి ఓకే చెప్పింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Akhanda 2 | బోయపాటి (Boyapati) దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన అఖండ–2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) అనుమతి ఇచ్చింది. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన అఖండ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అఖండ–2 తాండవంపై భారీ అంచనాలు ఉన్నాయి.

నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్​ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డిసెంబర్​ 4న ప్రీమియర్​ షోలు (Premiere shows) వేసుకోవడానికి సైతం ఓకే చెప్పింది. 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్​ షో వేసుకోవచ్చు. దీని టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు.

ఈ నెల 5న సినిమా రిలీజ్​ కానున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.75 రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు పెంచిన రేట్లు అమలులో ఉంటాయి.

Akhanda 2 | బాలయ్య ఫ్యాన్స్​లో జోష్

బాలయ్య అఖండ తర్వాత వీర సింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదు. దాదాపు రెండేళ్లుగా ఆయన సినిమాలు రిలీజ్​ కాలేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్​ అఖండ–2 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్​, ట్రైలర్​ మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రిలీజ్​ చేయనున్నారు. కాగా సినిమా టికెట్ల ధరలకు పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపగా.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Must Read
Related News