HomeUncategorizedPlane crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం.. ఫ్లైట్​లో 242 మంది ప్రయాణికులు

Plane crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం.. ఫ్లైట్​లో 242 మంది ప్రయాణికులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Plane crash | దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్​లోని అహ్మదాబాద్​ ఎయిర్​ పోర్టు (Ahmedabad Airport) నుంచి 242 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఎయిర్​ ఇండియా విమానం (Air India plane) టేకాఫ్​ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

అహ్మదాబాద్​ ఎయిర్​పోర్టు నుంచి లండన్​కు (London) వెళ్లాల్సిన ఎయిర్​ ఇండియాకు చెందిన AI-171 బోయింగ్​ విమానం 1.17 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే సాంకేతిక సమస్య కారణంగా జనావాసాలపై కుప్పకూలింది. అనంతరం ఫైట్​ నుంచి దట్టమైన మంటలు వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకున్నాయి. అప్పటికే విమాన ప్రమాదం గుర్తించిన ఏవియేషన్​ అధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్యూ ఆపరేషన్​ చేపట్టారు. పదుల కొద్దీ ఫైర్​ ఇంజన్లను మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Plane crash | స్పందించిన అమిత్​ షా

అహ్మదాబాద్​ విమాన ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్​షా (Union Home Minister Amit Shah) హుటాహుటిన గుజరాత్​ సీఎంతో (Gujarat CM) పాటు ఇతర అధికారులతో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు (Ram Mohan Naidu) హుటాహుటిన గుజరాత్​కు బయలు దేరారు.

ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన ఊపిరితో ఉన్న పలువురిని ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలు సోషల్​ మీడియాలో (Social media) బయటకు వచ్చాయి. కాగా.. విమానం బయలుదేరిన సమయంలో 2 పైలట్లు, 10 క్యాబిన్​ క్రూజ్​ సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

https://twitter.com/gemsofbabus_/status/1933090154148937934
Must Read
Related News