Plane crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం.. ఫ్లైట్​లో 242 మంది ప్రయాణికులు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Plane crash | దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్​లోని అహ్మదాబాద్​ ఎయిర్​ పోర్టు (Ahmedabad Airport) నుంచి 242 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఎయిర్​ ఇండియా విమానం (Air India plane) టేకాఫ్​ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అహ్మదాబాద్​ ఎయిర్​పోర్టు నుంచి లండన్​కు (London) వెళ్లాల్సిన ఎయిర్​ ఇండియాకు చెందిన AI-171 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Plane crash | దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్​లోని అహ్మదాబాద్​ ఎయిర్​ పోర్టు (Ahmedabad Airport) నుంచి 242 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఎయిర్​ ఇండియా విమానం (Air India plane) టేకాఫ్​ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

అహ్మదాబాద్​ ఎయిర్​పోర్టు నుంచి లండన్​కు (London) వెళ్లాల్సిన ఎయిర్​ ఇండియాకు చెందిన AI-171 బోయింగ్​ విమానం 1.17 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే సాంకేతిక సమస్య కారణంగా జనావాసాలపై కుప్పకూలింది. అనంతరం ఫైట్​ నుంచి దట్టమైన మంటలు వ్యాపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకున్నాయి. అప్పటికే విమాన ప్రమాదం గుర్తించిన ఏవియేషన్​ అధికారులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్యూ ఆపరేషన్​ చేపట్టారు. పదుల కొద్దీ ఫైర్​ ఇంజన్లను మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Plane crash | స్పందించిన అమిత్​ షా

అహ్మదాబాద్​ విమాన ప్రమాదం ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్​షా (Union Home Minister Amit Shah) హుటాహుటిన గుజరాత్​ సీఎంతో (Gujarat CM) పాటు ఇతర అధికారులతో మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు (Ram Mohan Naidu) హుటాహుటిన గుజరాత్​కు బయలు దేరారు.

ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన ఊపిరితో ఉన్న పలువురిని ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలు సోషల్​ మీడియాలో (Social media) బయటకు వచ్చాయి. కాగా.. విమానం బయలుదేరిన సమయంలో 2 పైలట్లు, 10 క్యాబిన్​ క్రూజ్​ సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

https://twitter.com/gemsofbabus_/status/1933090154148937934

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...