Lingampet | మైనారిటీ గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో (Minority Residential Boys School) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. 2017లో పాఠశాల ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ఉత్తమ నిర్వహణతో పాటు అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని తెలిపారు. పదో తరగతిలో […]

అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో (Minority Residential Boys School) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. 2017లో పాఠశాల ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ఉత్తమ నిర్వహణతో పాటు అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని తెలిపారు. పదో తరగతిలో ప్రతి ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నామని, క్రీడలలోనూ జిల్లా, రాష్ట్రస్థాయిలో కూడా పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారని వివరించారు.

Lingampet | బాసరలోనూ సీట్లు సాధించిన విద్యార్థులు..

తమ విద్యార్థులు పదో తరగతి తర్వాత ఐఐఐటీ బాసర (IIIT Basara) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఉన్నత చదువులకు అవకాశం పొందారని ప్రిన్సిపాల్​ తెలిపారు. గత రెండేళ్లుగా తమ విద్యార్థులు జన విజ్ఞాన వేదిక ( Jana Vignana Vedika) ఆధ్వర్యంలో నిర్వహించబడే చెకుముకి సైన్సు సంబరాల్లోనూ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలోనూ తమ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పోటీపడి ఉత్తమ స్థానంలో నిలిచారన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తమ పాఠశాలలో ఉత్తమ, నాణ్యమైన విద్యతో పాటుగా ప్రభుత్వం అన్ని రకాల ఉచిత సౌకర్యాలను కల్పిస్తుందని తెలిపారు.

Lingampet | ఐదో తరగతిలో..

వచ్చే 2026-27కు గాను.. ఐదో తరగతిలో మైనారిటీ పిల్లలకు 30, ఇతరులకు 10 సీట్ల చొప్పున అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రతినిధులు తెలిపారు. 6, 7, 8వ తరగతుల్లో గతేడాది మిగిలిన ఖాళీలకు కేవలం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మైనార్టీ గురుకుల కళాశాలలో కూడా ఎంపీసీ, బైపీసీ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని వారు కోరారు. అనంతరం పాఠశాల గోడప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి షౌకత్ అలీ, కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ రావు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ వాహిన్షీద్ సిద్దిఖీ, సదర్​లు ఫరూఖ్, వాహిద్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Pradesh Congress Committee) మైనారిటీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రఫీక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖాసిఫ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు ఖయ్యూం, అర్షద్, మౌల్వి నజీరుద్దీన్​లు పాఠశాల సమన్వయకర్త రామ్ గోపాల్, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయ, అధ్యాపక బృందాలతో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...