Adlur Yellareddy | హరియాణాలో అడ్లూర్​ ఎల్లారెడ్డి వాసి దారుణహత్య

అక్షరటుడే, కామారెడ్డి: Adlur Yellareddy | ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లిన ఓ వ్యక్తి హరియాణాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండురోజుల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సదాశివనగర్ మండలం (Sadashivanagar mandal) అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కటికే రజినీకాంత్ (45) ఎనిమిది నెలల క్రితం ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లాడు. అక్కడ నుంచి గత నెల 16న ఢిల్లీకి వచ్చి అటునుంచి హరియాణా వెళ్లినట్టుగా తెలుస్తోంది. […]

అక్షరటుడే, కామారెడ్డి: Adlur Yellareddy | ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లిన ఓ వ్యక్తి హరియాణాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండురోజుల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సదాశివనగర్ మండలం (Sadashivanagar mandal) అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కటికే రజినీకాంత్ (45) ఎనిమిది నెలల క్రితం ఉపాధి నిమిత్తం రష్యాకు వెళ్లాడు. అక్కడ నుంచి గత నెల 16న ఢిల్లీకి వచ్చి అటునుంచి హరియాణా వెళ్లినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం రజినీకాంత్ హరియాణాలో (Haryana) దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడి వద్ద రక్తపు మరకలతో కూడిన లెక్కలు వేసిన కాగితం లభించినట్టుగా తెలుస్తోంది.

Adlur Yellareddy | ఆర్థిక లావాదేవీలే కారణమా..?

హత్యకు ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరియాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకుని వస్తున్నారు. అయితే రష్యాకు వెళ్లిన రజినీకాంత్ ఢిల్లీ ఎందుకు వచ్చాడు..? అక్కడి నుంచి హరియాణాలో ఎందుకు వెళ్లాడు అనేది తెలియాల్సి ఉంది. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...