అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | రంగారెడ్డి (Rangareddy) ల్యాండ్, రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె శ్రీనివాసులు నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇళ్లతో పాటు కలెక్టరేట్లో సైతం సోదాలు చేపట్టారు.
అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తనిఖీలు చేపట్టారు. తన సర్వీసు కాలంలో అవినీతి కార్యకలాపాల ద్వారా ఆదాయ వనరులకు మించి ఆస్తులను సంపాదించినందుకు శ్రీనివాసులపై కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అతని ఇంట్లో, బంధువులు, స్నేహితులు, బినామీలు ఇతర సహచరులకు చెందిన 6 ప్రదేశాలలో సోదాలు చేపట్టామన్నారు.
ACB Raids | ఆస్తుల వివరాలు..
ఏడీ శ్రీనివాసులుకు హైదరాబాద్ (Hyderabad)లోని మై హోమ్ భూజాలో ఓ ఫ్లాట్ ఉంది. నారాయణపేటలో రైస్మిల్లు, 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11 ఎకరాల భూమి, కర్ణాటకలో మరో 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహబూబ్నగర్లో నాలుగు, నారాయణపేట్లో మూడు ప్లాట్లు ఉన్నాయి. సోదాల్లో భాగంగా అధికారులు రూ.5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఒక కియ సెల్టోస్, ఇన్నోవా కార్లు అతడి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. స్థిర, చరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈడీ శ్రీనివాస్ షెల్ కంపెనీలు సృష్టించి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.
