ACB Trap | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికిన సబ్​రిజిస్ట్రార్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ప్లాట్ల రిజిస్ట్రేషన్​ కోసం లంచం తీసుకుంటున్న ఇన్​ఛార్జి సబ్​ రిజిస్ట్రార్ (Sub-Registrar)​ను అధికారులు బుధవారం రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్​ అసిస్టెంట్​ సాయికుమార్​ ఇన్​ఛార్జి సబ్​ రిజిస్ట్రార్​గా వ్యవహరిస్తున్నాడు. ఓ వ్యక్తికి సంబంధించిన 11 ప్లాట్లలో రిజిస్ట్రేషన్ అయిన 4 ప్లాట్ల దస్తావేజులను అప్పగించడంతో పాటుగా మిగిలిన 7 ప్లాట్ల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ప్లాట్ల రిజిస్ట్రేషన్​ కోసం లంచం తీసుకుంటున్న ఇన్​ఛార్జి సబ్​ రిజిస్ట్రార్ (Sub-Registrar)​ను అధికారులు బుధవారం రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్​ అసిస్టెంట్​ సాయికుమార్​ ఇన్​ఛార్జి సబ్​ రిజిస్ట్రార్​గా వ్యవహరిస్తున్నాడు. ఓ వ్యక్తికి సంబంధించిన 11 ప్లాట్లలో రిజిస్ట్రేషన్ అయిన 4 ప్లాట్ల దస్తావేజులను అప్పగించడంతో పాటుగా మిగిలిన 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆయన లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ (ACB) అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.16,500 లంచం తీసుకుంటుంగా.. ఏసీబీ అధికారులు ఇన్​ఛార్జి సబ్​ రిజిస్ట్రార్​ సాయికుమార్​తో పాటు డాక్యమెంట్ రైటర్​ డి సాయికుమార్​, అసిస్టెంట్​ డాక్యమెంట్ రైటర్ డి అశోక్​ను రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Trap | తనిఖీలు చేస్తున్నా..

రాష్ట్రంలోని పలు సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. డాక్యుమెంట్​ రైటర్లు (Document writers), బ్రోకర్లతో కుమ్మక్కై ఆఫీసుల్లోని సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారు. కార్యాలయాల్లో ప్రైవేట్​ వ్యక్తులు ఉండొద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా.. డాక్యుమెంట్​ రైటర్లు అక్కడే తిష్ట వేస్తున్నారు. పనుల కోసం వచ్చే వారు ముందు వీరిని కలిస్తేనే రిజిస్ట్రేషన్లు చేసి పెడుతున్నారు. సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీతో పాటు ప్రభుత్వానికి భారీ ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు పలు సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు.

ACB Trap | 23 బృందాలతో..

ఏసీబీ అధికారులు నవంబర్​ 14న 23 బృందాలుగా పలు సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా ఆఫీసుల్లో లెక్కల్లో చూపని రూ. 2,51,990 నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 289 రిజిస్టర్డ్ పత్రాలు కూడా గుర్తించారు. దాదాపు 19 మంది ప్రైవేట్ వ్యక్తులు, 60 మంది డాక్యుమెంట్ రైటర్లు కూడా ఎటువంటి అనుమతి లేకుండా కార్యాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు. అలాగే 13 మంది సబ్​ రిజిస్ట్రార్ ఇళ్లలో కూడా ACB దాడి చేసి నగదు, నగలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయినా అవినీతి అధికారులు మాత్రం లంచం తీసుకోవడం మానడం లేదు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...