అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka Incident | కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లిదండ్రులతో పాటు చెల్లిని హత్య చేశాడు. అనంతరం ఇంట్లోనే పూడ్చి పెట్టారు.
కర్ణాటకలోని విజయనగర జిల్లా (Vizianagaram District) కొట్టూరు గ్రామంలో జయలక్ష్మి(45), భీమరాజ్(50) దపంతులకు అక్షయ్కుమార్ (24), అమృత(17) అనే పిల్లలు ఉన్నారు. అక్షయ్ కుమార్ టైర్ల షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చిత్రదుర్గ నగరం కిట్టిహళ్లికి చెందిన అక్షయ్ రెండేళ్ల క్రితం కుటుంబంతో కలిసి కొట్టూరు వెళ్లాడు. ఈ క్రమంలో ఈ నెల 27న అతడు తన తల్లిదండ్రులతో పాటు చెల్లి అమృతను హత్య చేశాడు. అనంతరం ఇంట్లోనే వారి మృతదేహాలను పూడ్చి పెట్టాడు.
Karnataka Incident | అనుమానం రావడంతో..
అక్షయ్ కుమార్ బెంగళూరు (Bengaluru) వెళ్లి తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ (Tilak Nagar Police Station)లో తన తండ్రి, తల్లి, చెల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్షయ్ కుమార్ తీరుపై అనుమానం రావడంతో ప్రశ్నించారు. దీంతో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు హత్య చేశాడనే వివరాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగర ఎస్పీ ఎస్ జాహ్నవి (SP Jahnavi), కుడ్లిగి డీఎస్పీ మల్లేష్ (DSP Mallesh) సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
