Makloor Mandal | భర్తను భార్య హత్య చేసిన కేసులో ట్విస్ట్.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘాతుకం

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం : Makloor Mandal | మాక్లూర్​ మండలం బోర్గాం(కె)లో భర్తను భార్య హత్య చేసిన కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బోర్గాం(కె) (Borgam(K))లో రమేష్​, సౌమ్యకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భార్య సౌమ్యకు దిలీప్​ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడడంతో ఈ విషయం తెలిసిన భర్త పలుమార్లు హెచ్చరించాడు. ఈక్రమంలో భర్తను హత్య చేసేందుకు […]

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం : Makloor Mandal | మాక్లూర్​ మండలం బోర్గాం(కె)లో భర్తను భార్య హత్య చేసిన కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బోర్గాం(కె) (Borgam(K))లో రమేష్​, సౌమ్యకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భార్య సౌమ్యకు దిలీప్​ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడడంతో ఈ విషయం తెలిసిన భర్త పలుమార్లు హెచ్చరించాడు. ఈక్రమంలో భర్తను హత్య చేసేందుకు భార్య సౌమ్య పన్నాగం పన్నింది.

Makloor Mandal | పక్కా ప్రణాళిక వేసి..

ముందుగా ఆర్మూర్​ (Armoor) ప్రాంతంలో కారుతో భర్తను యాక్సిడెంట్​ చేయించి హత్య చేయించేందుకు సౌమ్య ప్రయత్నించింది. కాని ఈ ప్రమాదంలో రమేష్​ కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. దీంతో మరోసారి సుపారీ గ్యాంగ్​తో హత్యకు ప్లాన్​ వేసింది. వారికి తన రింగ్​ను కుదువపెట్టి రూ. 35వేలు సమకూర్చింది. డిసెంబర్​19వ తేదీన రాత్రి నీళ్లల్లో నిద్రమాత్రలు కలిపి భర్తకు ఇవ్వగా నీళ్లు తాగిన రమేష్​ నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో సుపారీ గ్యాంగ్​ను సంప్రదించగా వారు ఆ రాత్రి లైన్​లోకి రాలేదు. దీంతో ప్రియుడు దిలీప్​తో కలిసి భార్య సౌమ్య భర్త రమేష్​ హత్యకు పూనుకుంది. రమేష్​ ముఖంపై దిండుతో అదిమిపట్టి.. టవల్​తో ఉరి బిగించి హత్య చేసింది.

Makloor Mandal | రూ.2 కోట్ల ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం..

తెల్లారిన తర్వాత తన భర్త గుండెపోటు (Heart Attack)తో మరణించాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు సైతం పూర్తిచేసింది. కాని అతడిది సాధారణ మరణం కాదని గ్రహించిన రమేష్​ తమ్ముడు ఇజ్రాయిల్​ నుంచి అనుమానం వ్యక్తం చేసి తన భార్యతో స్థానిక మాక్లూర్​ పోలీసు (Makloor Police)లకు ఫిర్యాదు ఇప్పించాడు. ఇలా నిందితురాలు సౌమ్య డొంక కదిలింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయండంతో సౌమ్య తన భర్తను ప్రియుడు దిలీప్​తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. రమేష్​ది సాధారణ మరణం అని నిర్ధారణ అయ్యాక వచ్చే ఇన్సూరెన్స్​ డబ్బులు (Insurance Money) రూ.2 కోట్లకు పైగా డబ్బులతో పరారయ్యేందుకు ప్లాన్​ చేసినట్లు ఒప్పుకుంది. పూర్తి వివరాలు త్వరలోనే పోలీసులు వెల్లడించనున్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...