Question paper leakage | అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రశ్నపత్రాల లీకేజీలో ట్విస్ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Question paper leakage | ప్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (Professor Jayashankar Agriculture University) పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్ట్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్​ వ్యవసాయ కాలేజీ (Warangal Agriculture College) సిబ్బంది పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్​లోని (Hyderabad) రాజేంద్రనగర్​లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. దీని పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీలు ఉన్నాయి. అయితే ఈ యూనివర్సిటీలోని సిబ్బంది, కొందరు విద్యార్థులు కలిసి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Question paper leakage | ప్రొఫెసర్​ జయశంకర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (Professor Jayashankar Agriculture University) పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్ట్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్​ వ్యవసాయ కాలేజీ (Warangal Agriculture College) సిబ్బంది పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

హైదరాబాద్​లోని (Hyderabad) రాజేంద్రనగర్​లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. దీని పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీలు ఉన్నాయి. అయితే ఈ యూనివర్సిటీలోని సిబ్బంది, కొందరు విద్యార్థులు కలిసి సెమిస్టర్​ ప్రశ్నాపత్రాలు లీక్​ చేసినట్లు అధికారులు గతంలో గుర్తించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో (agriculture department) ఏఈవోలు పని చేస్తూ యూనివర్సిటీలో ఇన్​ సర్వీస్​ కోటా కింద చదువుతున్న 35 మంది కలిసి దీనికి పాల్పడ్డట్లు తేల్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పలువురు యూనివర్సిటీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇన్​సర్వీస్​ కోటా కింద చదువుతున్న 35 మందిని డిస్మిస్​ చేసి, వ్యవసాయ శాఖకు సరెండర్​ చేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారం వరంగల్ కాలేజీ సిబ్బంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు.

Question paper leakage | 8 మంది ప్రవేశాలు రద్దు

వరంగల్ కాలేజీ సిబ్బంది సైతం లీకేజీకి సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్​ను సస్పెండ్ చేశారు. 8 మంది ఇన్ సర్వీస్ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేశారు. లీకేజ్ వ్యవహారంపై ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీని యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేశారు. పలు వ్యవసాయ కాలేజీల్లో కమిటీ సభ్యుల రహస్య విచారణ చేపట్టనున్నారు.

Question paper leakage | వారిని సస్పెండ్​ చేయాలి

వ్యవసాయ శాఖలో ఏఈవోలు పని చేస్తూ.. ఇన్​సర్వీస్​ కోటాలో చదువుతున్న పలువురు పేపర్​ లీకేజీలకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని వాట్సాప్​లో పేపర్లను లీక్​ చేసినట్లు తెలిసింది. దీంతో యూనివర్సిటీ అధికారులు వారిని డిస్మిస్​ చేశారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు సైతం వారిని ఉద్యోగాల్లో నుంచి సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్​ చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారు విధులు సక్రమంగా నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

Related articles

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.

BC Reservations Congress | కాంగ్రెస్​ హయాంలోనే బీసీలకు ప్రాధాన్యత..:​ ఈరవత్రి అనిల్​

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు.