Nagarkurnool | ఆర్టీసీ బస్సు, బైక్​ను ఢీకొన్న లారీ : ఒకరి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ లారీ ఆర్టీసీ బస్సు, బైక్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం (Veldanda Mandal) పెద్దాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్​ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులోని 9 మందికి గాయాలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఓ లారీ ఆర్టీసీ బస్సు, బైక్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం (Veldanda Mandal) పెద్దాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్​ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులోని 9 మందికి గాయాలు అయ్యాయి. మృతుడు హైదరాబాద్ (Hyderabad)​లోని HDFC బ్యాంక్​లో పని చేస్తున్న రాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనలో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది.

Nagarkurnool | ఖమ్మం జిల్లాలో..

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తల్లాడ మండలం పాత పినపాక వద్ద వాటర్ ట్యాంకర్​ను కారు ఢీకొంది. వైరా మండలం సోమవరం వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఆరుగురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పొగ మంచు వల్లే రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. కాగా పండుగ పూట వరుస ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...