Chirutha | నాగిరెడ్డిపేట్​లో చిరుత కలకలం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Chirutha | నాగిరెడ్డిపేట మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తాండూర్ గేట్ సమీపంలోని ధర్మారెడ్డి బీట్ అటవీ  ప్రాంతంలో (Dharmareddy Beat Forest Area) చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. Chirutha | ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో.. తాండూర్ గేట్ (Tandur Gate) సమీపంలోని ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారి దాటుతూ శనివారం ఉదయం11 గంటలకు స్థానికులకు చిరుత కనిపించింది. దీంతో ఈ విషయాన్ని స్థానికులు నాగిరెడ్డిపేట […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Chirutha | నాగిరెడ్డిపేట మండలంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తాండూర్ గేట్ సమీపంలోని ధర్మారెడ్డి బీట్ అటవీ  ప్రాంతంలో (Dharmareddy Beat Forest Area) చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

Chirutha | ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో..

తాండూర్ గేట్ (Tandur Gate) సమీపంలోని ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారి దాటుతూ శనివారం ఉదయం11 గంటలకు స్థానికులకు చిరుత కనిపించింది. దీంతో ఈ విషయాన్ని స్థానికులు నాగిరెడ్డిపేట మండల (Nagireddypeta Mandal) అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అట‌వీశాఖ రేంజ్ అధికారి వాసుదేవ్ తన రేంజ్ సిబ్బందితో కలిసి తాండూర్ గేట్​ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి చిరుత ఆచూకీపై తనిఖీ చేశారు. అక్కడ చిరుతపులి (Leopard) పాద ముద్రలు, స్కాట్స్ (విసర్జీతం) గుర్తించినట్లు ఎఫ్​ఆర్వో వాసుదేవ్ తెలిపారు.

Chirutha | జాగ్రత్తగా ఉండాలి..

ధర్మారెడ్డి అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా నిర్ధారణ జరిగినందున అడవి సమీపంలోని తాండూర్, ధర్మారెడ్డి, బంజార తండా, లింగంపల్లి కలాన్ గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. రైతులు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. తనిఖీల్లో డీఆర్వో రవికుమార్, బీట్ అధికారి నవీన్ బేస్ క్యాంప్​ సిబ్బంది గోపాల్ పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...