అక్షరటుడే, ఇందూరు: Farewell Party | జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj Government Degree College) మంగళవారం ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ (MSC Organic Chemistry) విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శన, పాటలు, సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, విభాగాధిపతి డాక్టర్ రాజేష్, సీవోఐ భరతరాజ్, నహీదా, పీజీ కోఆర్డినేటర్ వెంకటేశం గౌడ్, డాక్టర్ హన్మాండ్లు, డాక్టర్ వెంకటరమణ, రంజిత్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
