Chinese Manja | చైనా మాంజాపై ఉక్కుపాదం.. 57 మంది అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chinese Manja | చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మనుషులు, పక్షుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దీని నివారణకు చర్యలు చేపట్టారు. సంక్రాంతి పండుగ (Sankranti Festival) సమీపిస్తోంది. ఆకాశంలో గాలిపటాలు సందడి చేస్తున్నాయి. యువత, చిన్నారులు ఉత్సాహంగా పతంగులు ఎగుర వేస్తున్నారు. అయితే పలువురు చైనా మాంజా వినియోగిస్తున్నారు. దీనిపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మారడం లేదు. దీంతో హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chinese Manja | చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మనుషులు, పక్షుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దీని నివారణకు చర్యలు చేపట్టారు.

సంక్రాంతి పండుగ (Sankranti Festival) సమీపిస్తోంది. ఆకాశంలో గాలిపటాలు సందడి చేస్తున్నాయి. యువత, చిన్నారులు ఉత్సాహంగా పతంగులు ఎగుర వేస్తున్నారు. అయితే పలువురు చైనా మాంజా వినియోగిస్తున్నారు. దీనిపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మారడం లేదు. దీంతో హైదరాబాద్​ పోలీసులు (Hyderabad Police) చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగర సీపీ సజ్జనార్​ (CP Sajjanar) చైనా మాంజాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు పోలీసులు నిత్యం ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.

Chinese Manja | నాలుగు రోజుల్లో

హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోందని సీసీ సజ్జనార్​ తెలిపారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు రూ.43 లక్షల విలువైన 2,150 బాబిన్లను సీజ్​ చేశామన్నారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ నిషేధిత మాంజాను విక్రయిస్తున్న వ్యవహారంలో 29 కేసులు నమోదు చేసి.. 57 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత నెల రోజుల్లో నమోదైన 132 కేసుల్లో.. రూ. 1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్లను స్వాధీనం చేసుకొని, మొత్తంగా 200 మందిని అరెస్ట్ చేశారు. నిషేధిత మాంజాను విక్రయించినా, కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదని సీపీ సజ్జనార్​ హెచ్చరించారు.

Chinese Manja | పలువురికి గాయాలు

చైనా మాంజాతో హైదరాబాద్​ నగరంలో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. అంబర్​పేట ఫ్లై ఓవర్​పై బైక్​ వెళ్తున్న వ్యక్తికి చైనా మాంజా కోసుకుంది. ఇటీవల ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి సైతం గాయపడ్డాడు. దీంతో పోలీసులు తనిఖీలు మరింత తీవ్రం చేశారు. గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదని సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా అవగాహన కల్పిస్తున్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...