MP Arvind | కేటీఆర్​పై డ్రగ్స్​ కేసు పెట్టాలి.. ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | కేటీఆర్​ (KTR)పై నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై డ్రగ్స్​ కేసు పెట్టాలన్నారు. జగిత్యాల (Jagtial)లోని ఓ హోటల్​లో మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ తీసుకునే వారికి ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో కేటీఆర్‌ది అదే క్యారెక్టర్​ అని అర్వింద్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పై డ్రగ్స్ పెడ్లర్‌, డ్రగ్స్ ప్రమోటర్ కేసు పెట్టాలని డిమాండ్​ చేశారు. తెలంగాణలో ఫోన్​ ట్యాపింగ్​ (Phone Tapping) జరిగిందన్నారు. దీనికి అనేక […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | కేటీఆర్​ (KTR)పై నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై డ్రగ్స్​ కేసు పెట్టాలన్నారు. జగిత్యాల (Jagtial)లోని ఓ హోటల్​లో మీడియాతో మాట్లాడారు.

డ్రగ్స్ తీసుకునే వారికి ఎలాంటి క్యారెక్టర్ ఉంటుందో కేటీఆర్‌ది అదే క్యారెక్టర్​ అని అర్వింద్​ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌పై డ్రగ్స్ పెడ్లర్‌, డ్రగ్స్ ప్రమోటర్ కేసు పెట్టాలని డిమాండ్​ చేశారు. తెలంగాణలో ఫోన్​ ట్యాపింగ్​ (Phone Tapping) జరిగిందన్నారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ట్యాపింగ్​కు పాల్పడిన వారిని అరెస్ట్​ చేస్తారా లేదా అనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ప్యాకేజీకి అమ్ముడుపోతారా? లేక నిజాయితీగా పనిచేస్తారా అన్నది చూడాలని పేర్కొన్నారు.

MP Arvind | జీవన్​రెడ్డిని హింసిస్తున్న కాంగ్రెస్​

జగిత్యాల రాజకీయాలపై అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy)పై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆయన తెలిపారు. ఈ వయసులో ఆయనను హింసించడం మహా పాపం అన్నారు. ఎలక్షన్ టైం కాకపోతే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించేవాడినని చెప్పారు. ఆయనను మానసిక క్షోభకు గురిచేయడం కాంగ్రెస్​కు మంచిది కాదన్నారు. కాగా జగిత్యాలలో బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన సంజయ్​ కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. ఆయనన చేరికను జీవన్​రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల కాంగ్రెస్​లో వర్గపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అర్వింద్​ వ్యాఖ్యలు చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...