Thailand | రైలుపై పడిన క్రేన్​.. 22 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thailand | థాయిలాండ్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కదులుతున్న రైలుపై క్రేన్​ పడటంతో 22 మంది చనిపోయారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బ్యాంకాక్ (Bangkok) నుంచి థాయిలాండ్​లోని ఈశాన్య ప్రావిన్స్​కు వెళ్తున్న రైలుపై క్రేన్​ పడింది. ఈ మార్గంలో హైస్పీడ్​ రైలు ప్రాజెక్ట్​ కోసం నిర్మాణ పనులు సాగుతున్నాయి. కింద రైల్వే ట్రాక్​ ఉండగా.. పైన పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేన్ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thailand | థాయిలాండ్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కదులుతున్న రైలుపై క్రేన్​ పడటంతో 22 మంది చనిపోయారు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

బ్యాంకాక్ (Bangkok) నుంచి థాయిలాండ్​లోని ఈశాన్య ప్రావిన్స్​కు వెళ్తున్న రైలుపై క్రేన్​ పడింది. ఈ మార్గంలో హైస్పీడ్​ రైలు ప్రాజెక్ట్​ కోసం నిర్మాణ పనులు సాగుతున్నాయి. కింద రైల్వే ట్రాక్​ ఉండగా.. పైన పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేన్ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అయితే అదే సమయంలో ఆ మార్గంలో రైలు రావడంతో ఒక బోగిపై అది పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మరణించగా, కనీసం 30 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బ్యాంకాక్ కు ఈశాన్యంగా 230 కి.మీ దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్​లోని సిఖియో జిల్లా (Sikhio District)లో ఈ ప్రమాదం జరిగింది.

Thailand | పట్టాలు తప్పిన రైలు

రైలు థాయిలాండ్​లోని ఉబోన్ రాట్చని ప్రావిన్స్​కు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఒక క్రేన్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుపై పనిచేస్తుండగా అది కూలిపోయి ప్రయాణిస్తున్న రైలుపై పడిందన్నారు. దీంతో రైలు పట్టాలు తప్పింది. కొద్దిసేపు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలను మోహరించినట్లు థాయ్ ప్రభుత్వం (Thai Government) తెలిపింది. రైలులో దాదాపు 195 మంది ప్రయాణికులు ఉన్నారని థాయిలాండ్ రవాణా మంత్రి ఫిఫాట్ తెలిపారు. బాధితులను గుర్తించడానికి, గాయపడిన వారికి వైద్య సహాయం అందించడానికి చర్యలు చేపట్టామన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...