Talasani Srinivas Yadav | మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​పై కేసు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Talasani Srinivas Yadav | మాజీ మంత్రి, సనత్​నగర్ (Sanath Nagar)​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​యాదవ్​పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు కేసు పెట్టారు. సికింద్రాబాద్ (Secunderabad)​ను విభజించే కుట్ర జరుగుతోందని ఇటీవల తలసాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మాట్లాడుతూ.. ‘‘సికింద్రాబాద్​ను ముక్కలు చేస్తే.. నిన్ను ముక్కలు చేస్తాం’ అంటూ సీఎంను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన తన […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Talasani Srinivas Yadav | మాజీ మంత్రి, సనత్​నగర్ (Sanath Nagar)​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​యాదవ్​పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు కేసు పెట్టారు.

సికింద్రాబాద్ (Secunderabad)​ను విభజించే కుట్ర జరుగుతోందని ఇటీవల తలసాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మాట్లాడుతూ.. ‘‘సికింద్రాబాద్​ను ముక్కలు చేస్తే.. నిన్ను ముక్కలు చేస్తాం’ అంటూ సీఎంను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. ఈ క్రమంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నేత రవి కిరణ్ తలసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Talasani Srinivas Yadav | దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సికింద్రాబాద్​లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి తలసాని వ్యాఖ్యలు చేసినట్టు రవి కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్​ఆర్​ నగర్​ పోలీసులు (SR Nagar Police) దర్యాప్తు చేస్తున్నారు. కాగా సీఎంపై తలసాని వ్యాఖ్యలను కాంగ్రెస్​ నేతలు ఖండించారు. అయితే తాను ఆవేశంలో అలా మాట్లాడినట్లు ఇప్పటికే తలసాని వివరణ ఇచ్చారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులను తాను గౌరవిస్తానని చెప్పారు. మరి ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. కాగా సికింద్రాబాద్​ పరిధిలోని ప్రాంతాలను మల్కాజ్​గిరి కమిషనరేట్​లో కలపడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 17న బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...