Nirmal Accident | కంటైనర్​ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nirmal Accident | నిర్మల్ జిల్లా భైంసా దగ్గర మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కంటైనర్​ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. సత్​పూల్ బ్రిడ్జి (Satpul Bridge) దగ్గర కంటైనర్​ను వెనకనుంచి వస్తోన్న కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది.  కారు డ్రైవర్​తో పాటు మరో ముగ్గురు స్పాట్​లోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కుబీర్ మండలం (Kubir […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nirmal Accident | నిర్మల్ జిల్లా భైంసా దగ్గర మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. కంటైనర్​ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు.

సత్​పూల్ బ్రిడ్జి (Satpul Bridge) దగ్గర కంటైనర్​ను వెనకనుంచి వస్తోన్న కారు ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది.  కారు డ్రైవర్​తో పాటు మరో ముగ్గురు స్పాట్​లోనే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కుబీర్ మండలం (Kubir Mandal) కుప్టి గ్రామానికి చెందిన భోజరం పటేల్42, రాజన్న(60), బాబన్న (70), వికాస్​గా గుర్తించారు. వీళ్లు హైదరాబాద్​లో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Nirmal Accident | ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు బోల్తా

కొత్తగూడెం జిల్లా (Kothagudem District) దమ్మపేట (మండలం) గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగారులను పోలీసుల వాహనాలు, అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. కాగా ఇటీవల బస్సు ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేట్​, ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం ప్రమాదాలు అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...