Tirumala | తిరుమలలో సాధారణ భక్తుల ద‌ర్శ‌నం వేగ‌వంతం.. శ్రీవారి సేవకులుగా డాక్టర్లకు ఛాన్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో సామాన్య భక్తులకు మరింత వేగంగా, ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులణ/ ఆదేశించారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, టీటీడీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేసి మరింత పారదర్శకతను తీసుకురావాలని సీఎం (CM Chandrababu Naidu) సూచించారు. అలాగే అన్ని టీటీడీ సేవలను వాట్సాప్‌ గవర్నెన్స్‌లోకి తీసుకువచ్చే దిశగా చర్యలు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో సామాన్య భక్తులకు మరింత వేగంగా, ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులణ/ ఆదేశించారు.

భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, టీటీడీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేసి మరింత పారదర్శకతను తీసుకురావాలని సీఎం (CM Chandrababu Naidu) సూచించారు. అలాగే అన్ని టీటీడీ సేవలను వాట్సాప్‌ గవర్నెన్స్‌లోకి తీసుకువచ్చే దిశగా చర్యలు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

Tirumala | వైకుంఠ ఏకాదశి కోసం ప్రత్యేక ఏర్పాట్లు

చిరకాలంగా తిరుమలలో అత్యధిక రద్దీ ఏర్పడే వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా, భక్తుల దర్శన సౌకర్యాలను పక్కాగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అధికారి వర్గాలు ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు (TTD Officers) సీఎంకి నివేదించారు. పండుగలు, ప్రత్యేక రోజులలో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్నప్రసాదం–లడ్డూ నాణ్యతను మరింత మెరుగుపరిచామని తెలిపారు. రోజుకు 2.75 లక్షల మందికి అన్నప్రసాదం అందించేందుకు కిచెన్ ఆధునీకరణ పనులు కూడా చేపడుతున్నట్లు వివరించారు.

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రముఖ డాక్టర్లను “శ్రీవారి సేవకులు”గా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రుల తరహాలో సేవాభావంతో వైద్యులు తిరుమలలో పనిచేయాలని సూచించారు. తిరుపతిలోని శ్విమ్స్, రుయా, బర్డ్‌ వంటి కీలక ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులను వెంటనే తరలించే ప్రత్యేక విధానాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల దృష్ట్యా అన్ని ప్రధాన భాషల్లో రిజిస్ట్రేషన్ సదుపాయం ఉండాలని సీఎం అన్నారు.

భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమం అన్ని ఆలయాల్లో నిరంతరాయంగా కొనసాగాలని, సేవలు ఏ విషయంలోనూ అంతరాయం కలగవద్దని సూచించారు. దేశ, విదేశాల్లో నిర్మించే ప్రతి కొత్త ఆలయం టీటీడీ ప్రధాన ఆలయంతో అనుసంధానం చేసే విధంగా వ్యవస్థను రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి ఆస్తులు, ధనం విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, దుర్వినియోగం ఏదైనా చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తిరుమలలో (Tirumala) అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను రాష్ట్రంలోని ఇతర ముఖ్య ఆలయాల్లో కూడా అమలు చేయాలని సూచించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...