Local Body Elections | నిజామాబాద్‌ రూరల్‌లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు: రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే నిజామాబాద్‌ సిటీ: Local Body Elections | గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్. భూపతిరెడ్డి (MLA Dr. R. Bhupathi Reddy) తెలిపారు. నగర శివారులోని క్యాంప్​ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో 126 నాన్‌ షెడ్యూల్‌ గ్రామపంచాయతీలు (non-schedule Gram Panchayats) ఉన్నాయని, వాటిలోని 64 జనరల్‌ స్థానాల్లో 32 సీట్లు బీసీలకు కేటాయించామని తెలిపారు. బీసీల […]

అక్షరటుడే నిజామాబాద్‌ సిటీ: Local Body Elections | గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 51.6 శాతం రిజర్వేషన్లు కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్. భూపతిరెడ్డి (MLA Dr. R. Bhupathi Reddy) తెలిపారు.

నగర శివారులోని క్యాంప్​ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో 126 నాన్‌ షెడ్యూల్‌ గ్రామపంచాయతీలు (non-schedule Gram Panchayats) ఉన్నాయని, వాటిలోని 64 జనరల్‌ స్థానాల్లో 32 సీట్లు బీసీలకు కేటాయించామని తెలిపారు. బీసీల రిజర్వేషన్లను 51.6 శాతం వరకూ పెంచి సామాజిక న్యాయాన్ని అమలు చేశామని అన్నారు.

Local Body Elections | కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో (Kamareddy BC declaration) పేర్కొన్న విధంగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ,బీఆర్‌ఎస్ కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో బీసీ బిల్లుపై రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Local Body Elections | ఏకగ్రీవ జీపీలకు ప్రోత్సాహకం

నియోజకవర్గంలో ఏకగ్రీవమైన మేజర్‌ గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధుల నుంచి రూ.20 లక్షలు, మైనర్‌ జీపీలకు రూ.10 లక్షల ప్రోత్సాహకం ఇస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ తరఫున ఇప్పటికే ఏకగ్రీవ జీపీలకు రూ.10 లక్షలు ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పటివరకు 33 జీపీలు ఏకగ్రీవమయ్యాయని, మరో రెండు రోజుల్లో మరికొన్ని ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్‌ బాడ్సి శేఖర్‌ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్‌ భాస్కర్‌రెడ్డి, ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కెతావత్‌ యాదగిరి, నాయకులు మునిపల్లి సాయిరెడ్డి, బాగారెడ్డి, అమృతాపూర్‌ గంగాధర్‌, నవీన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...