Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఆమె చేపట్టిన జనహిత పాదయాత్ర ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు రోడ్లు ప్రారంభమై జెండాగల్లి, గోల్​ బంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ వరకు సాగింది. అనంతరం పెర్కిట్ చౌరస్తాలో ఆమె మాట్లాడుతూ పాదయాత్రలతోనే ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల […]

అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఆమె చేపట్టిన జనహిత పాదయాత్ర ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు రోడ్లు ప్రారంభమై జెండాగల్లి, గోల్​ బంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ వరకు సాగింది.

అనంతరం పెర్కిట్ చౌరస్తాలో ఆమె మాట్లాడుతూ పాదయాత్రలతోనే ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేశారన్నారు. ఈ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. కష్టాలు లేని ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పాదయాత్రలు చేపడుతున్నామన్నారు.

Meenakshi natarajan | సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే తప్పేముంది: టీపీసీసీ చీఫ్​

పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఈ రాద్ధాంతమంతా జరుగుతోందన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే తప్పేముందని, ఢిల్లీకి తప్పకుండా పోతామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలని కేంద్రం నుంచి ప్రాజెక్టుల కోసం ఢిల్లీకి వెళ్తామని.. తమ అధినాయకత్వం సైతం ఢిల్లీలో ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీ కాంతారావు, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, సంపత్, కార్పొరేషన్ ఛైర్మన్లు మానాల మోహన్ రెడ్డి, కాసుల బాలరాజ్, మాజీ ఎంపీ మధు యాష్కీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి, ఆర్మూర్ నాయకులు పాల్గొన్నారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...